Don't Miss!
- Sports వేరీజ్ `మ్యాడ్` మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- News వైసీపీ అభ్యర్థికి జగన్ బంపర్ ఆఫర్.. పులివెందుల నుంచి పోటీ చేయలంటూ సూచన
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
నిన్న బిచ్చగాడికి... ఇపుడు మహేష్ బాబుకి!
హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో ఓ భారీ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈచిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నారు. ఈ నెల 29 నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా ఎంపికైంది.
ఈ సినిమాలో మహేష్ బాబు తల్లి పాత్రలో కోలీవుడ్ నటి దీపా రామానుజమ్ ను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వచ్చిన 'బిచ్చగాడు' సినిమాలో తల్లి పాత్రలో అందరినీ ఆకట్టుకున్న ఆమె... ఇపుడు మహేష్ బాబుకు తల్లిగా కనిపించబోతోంది.
మహేష్ బాబు ఈ సినిమాతో తమిళంలోనూ తన మార్కెట్ పెంచుకోవాలని చూస్తున్నాడు. అందుకే మురుగదాస్ దర్శకత్వలో చేస్తున్నాడు. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమా ఒకేసారి తెరకెక్కబోతోంది. అందుకే నటీనటుల ఎంపిక విషయంలో రెండు బాషల నటీనటులు బ్యాలెన్స్ గా ఉండేలా చూసుకుంటున్నారు.
ఈ సినిమాలో దర్శకుడు ఎస్.జె.సూర్య కూడా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో అతడు మహేష్ బాబుకు విలన్ పాత్రలో కనిపిస్తాడని అంటున్నారు. ఎస్.జె.సూర్య భార్య పాత్రలో అత్తారంటికి ఫేం నదియా నటించబోతున్నట్లు టాక్. ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేసేలా షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేసారు.