ఫ్రభాస్ ఫోన్ చేసి ఏ హెల్ప్ కావాలన్నా అడగమన్నాడు
పబ్లిసిటీకి దూరంగా ఉండే హీరో ప్రభాస్...సినిమా విజయవంతం కావడంతో ఆయనే ఫోన్ చేసి...పబ్లిసిటి విషయంలో ఏం హెల్ప్ కావాలన్నా అడగమన్నారు. సినిమా బాగుందనే ఫోన్ మొదట చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి వచ్చింది. అక్కడనుంచి ఓ అభిమాని ఫోన్చేసి కంగ్రాట్స్ అన్నారని తెలిపారు. అందుకే అక్కడ నుంచి 'మిస్టర్ పర్ ఫెక్ట్' జైత్రయాత్ర ప్రారంభిద్దామని అనగానే ప్రభాస్ ఒప్పుకున్నారు అని దిల్ రాజు చెప్పుకొచ్చారు. క్రితం శుక్రవారం విడుదలైన 'మిస్టర్ పర్ ఫెక్ట్' హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి విజయ యాత్ర చేయాలని ప్లాన్ చేసారు. ఈ విషయాన్ని మీడియాకు తెలపటానకి సమావేశం ఏర్పాటు చేసి ఇలా చెప్పారు. అలాగే 'మిస్టర్ పర్ ఫెక్ట్'ని బొమ్మరిల్లు అంటున్నారు అని మురసిపోతూ చెప్పారు దిల్ రాజు. త్వరలో రాయలసీమలో మా చిత్ర బృందం ప్రేక్షకుల ముందుకు వెళ్తుంది. విశాఖపట్నంలో ప్లాటినమ్ డిస్కు వేడుకల్ని చేస్తామన్నారు.


Click it and Unblock the Notifications











