Don't Miss!
- News నరసాపురం నాదే-రెండ్రోజుల్లో ఎన్డీయే అభ్యర్ధిగా ప్రకటన-రఘురామ కామెంట్స్..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
బాలీవుడ్ నుండి రాజమౌళికి రూ. 20 కోట్ల ఆఫర్
హైదరాబాద్: ‘బాహుబలి' సినిమా బాక్సాఫీసు వద్ద భారీ విజయం సాధించడం, ఏకంగా రూ. 500 కోట్లు వసూలు చేయడం అందరినీ ఆశ్చర్య పరిచింది. దర్శకుడు రాజమౌళి అపజయం ఎరుగని దర్శకుడని తెలుగువారందరికీ తెలుసు. ఆయన స్టామినా ఏమిటో దేశం మొత్తానికి తెలియడంతో పాటు, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది మాత్రం ‘బాహుబలి' సినిమా తర్వాతే.
ఓ తెలుగు సినిమా హిందీలో అవనువాదం అయి బాలీవుడ్లో రూ. 100 కోట్ల మార్కును అందుకుంది. అదే ఆయన నేరుగా బాలీవుడ్ స్టార్లతో సినిమా తీస్తే భారీ వసూళ్లు సాధించే సినిమా తీయడం ఖాయం అని అక్కడి నిర్మాతలు నమ్ముతున్నారు. రాజమౌళి గురించి బాగా తెలిసిన బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ రాజమౌళిపై నమ్మకంతో ‘బాహుబలి' సినిమాను హిందీలో ప్రమోట్ చేసారు. రాజమౌళి సినిమా విషయంలో కరణ్ జోహార్ నమ్మకం నిజమైంది.
తాజాగా కరణ్ జోహార్ రాజమౌళికి మరో ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రూ. 20 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేస్తూ హిందీలో ఓ సినిమా చేసి పెట్టమని అడిగారట. వాస్తవానికి రాజమౌళికి చాలా కాలం నుండి బాలీవుడ్లో ఆఫర్లు వస్తున్నాయి. తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ విక్రమార్కుడు సినిమాను హిందీలో రీమేక్ చేయమని తొలుత రాజమౌళినే అడిగాడు సంజయ్ లీలా భన్సాలీ. అయితే అప్పటికే రాజమౌళి దృష్టంతా బాహుబలి మీద ఉండటంతో నో చెప్పాడట.
త్వరలో రాజమౌళి ‘బాహుబలి' పార్ట్ 2 షూటింగుకు రెడీ అవుతున్నాడు. బాహుబలి ఫార్ట్ 1 భారీ విజయం సాధించడంతో రెండో భాగం...... పార్ట్ 2ను బాలీవుడ్ స్టార్లయిన హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్ లతో తీస్తే మంచి ఫలితాలు వస్తాయని కరణ్ జోహార్ సూచించాడట. అయితే రాజమౌళి అందుకు టెమ్ట్ కాలేదు, తాను ముందుకు అనుకున్న ప్రకారం ప్రభాస్, రానాలతోనే సెకండ్ పార్ట్ పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడు.