Don't Miss!
- News కడప కోర్టు ఆంక్షలపై హైకోర్టుకు సునీత..! వైసీపీపై కీలక వ్యాఖ్యలు..
- Finance Anant Ambani: తండ్రికి తగ్గ తనయుడు అనంత్ అంబానీ.. ఆ ఆలయాలకు భారీ విరాళాలు..!!
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడ్డినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
ఆస్కార్ స్క్రీనింగ్ కమిటీ సభ్యునిగా ఎన్.శంకర్
ఈయన గతంలో నంది పురస్కార కమిటీ సభ్యునిగా రెండు సార్లు, అధ్యక్షునిగా ఒకసారి వ్యవహరించారు. దీంతోపాటు గోవా ఫిలిం ఫెస్టివల్, జాతీయ సినిమా అకాడమీ పురస్కారాల జ్యూరీకి సభ్యునిగానూ పని చేశారు. ప్రస్తుత ఆస్కార్ స్క్రీనింగ్ కమిటీలో ఈయనతోపాటు నిర్మాత సీవీరెడ్డి కూడా తెలుగు నుంచి సభ్యులుగా ఎంపికయ్యారు.
ఇక సీనియర్ దర్శకుడిగా చిత్ర పరిక్షిశమకు చెందిన పలు అవార్డు కమిటీల్లో వివిధ హోదాల్లో పనిచేశారాయన. తాజాగా ఆయన ప్రతిష్టాత్మక ఆస్కార్ ఫిల్మ్ అవార్డు కమిటీ జ్యూరీ మెంబర్గా ఎన్నికవటంతో పరిశ్రమ ఆనందం వ్యక్తం చేస్తోంది. ఆస్కార్ అవార్డుల కోసం నామినేట్ చేసే భారతీయ సినిమాల్ని ఈ కమిటీ ఎంపికచేస్తుంది. సినిమాకు సామాజిక ప్రయోజనం వుందని బలంగా విశ్వసించే దర్శకుల్లో ఎన్.శంకర్ ఒకరు. ఆయన సినిమాల్లో అంతర్లీనంగా సామాజిక స్పృహ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
తె లుగులో తొమ్మిది చిత్రాలను రూ పొందించిన ఆయన దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకున్నారు. 2003 లో నేషనల్ ఫిలిం అవార్డుల కమిటీలో జ్యూరీ మెంబర్గా విశిష్ట సేవలందించిన శంకర్ 2010లో రాష్ట్ర ప్రభుత్వం అందజేసే నంది అవార్డుల కమిటీ చైర్మన్గానూ వ్యవహరించారు. మరో రెండు సార్లు నంది అవార్డుల కమిటీలో జ్యూరీ మెంబర్గా పనిచేసిన ఆయన 2009లో గోవా ఫిలిం ఫెస్టివల్కు జ్యూరీ మెంబర్గా సేవలందించారు. తెలుగు చిత్రసీమకు చెందిన ఎన్.శంకర్ ఆస్కార్ కమిటీ జ్యూరీ మెంబర్గా ఎంపిక కావడం పట్ల పలువురు చిత్రసీమకు చెందిన ప్రముఖులు ఆయనకు అభినందనలు అందజేశారు. జాతీయ స్థాయిలోనేగాక, అంతర్జాతీయ స్థాయిలో మన తెలుగు చిత్రసీమ ఖ్యాతి ఇనుమడింపజేయడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.