Don't Miss!
- News పవన్ చేతిలో జాతీయ జెండా.. ! పిఠాపురంలో కోడ్ ఉల్లంఘన ?
- Sports T20 వరల్డ్ కప్కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Automobiles వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి వీడియో
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
ఎవరితోనూ మాట్లాడలేదు.. ‘డ్రగ్’ నోటీసులపై స్పందించిన పూరీ జగన్నాథ్
డ్రగ్ కేసు వ్యవహారంపై దర్శకుడు పూరీ జగన్నాథ్ సోషల్ మీడియాలో స్పందించారు. డ్రగ్ సప్లయర్లతో సంబంధముందని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఈ వ్యవహారంలో తాను ఎవరితోనూ మాట్లాడలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనపై తాను ఇప్పటివరకు స్పందించలేదని ఆయన ట్విట్ చేశారు. డ్రగ్స్ సప్లయర్ కెల్విన్ అరెస్ట్ నేపథ్యంలో శుక్రవారం ఎక్సైజ్ శాఖ పూరీ జగన్నాథ్కు నోటీసులు జారీ చేశారనే వార్త మీడియాలో సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఆయన ట్విట్టర్లో స్పందించారు.
డ్రగ్ వ్యవహారం గురించి నేను ఎవరితో కూడా మాట్లాడలేదు. దేనికి గురించి చర్చించలేదు. ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న పైసా వసూల్ చిత్ర షూటింగ్లో బిజీగా ఉన్నాను అని ట్విట్టర్లో ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్లో సంచలనం రేపుతున్న డ్రగ్స్ కేసులో టాలీవుడ్ పరిశ్రమలోని పలువురు నటులకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
I have not given any statement regarding anything n anyone till now ..
— PURI JAGAN (@purijagan) July 15, 2017
very busy completing my film #PaisaVasool