For Daily Alerts
Don't Miss!
- News ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
లోఫర్ లాస్: డైరెక్టర్ పూరీ జగన్నాథ్పై డిస్ట్రిబ్యూటర్ల దాడి
News
oi-Pratapreddy
By Pratap
|
హైదరాబాద్: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్పై పలువురు డిస్ట్రిబ్యూటర్లు దాడి చేశారు. గతంలో పూరి దర్శకత్వంలో వచ్చిన ‘లోఫర్' సినిమాతో నష్టపోయామంటూ అభిషేక్, ముత్యాలు, సుధీర్ అనే ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లు పూరీ ఇంటి వద్ద రభస సృష్టించారు.
పూరీ ఆఫీస్పైనా కూడా దాడి చేశారు. రాబోయే కాలంలో పూరి జగన్నాథ్ తెరకెక్కించే సినిమాలకు డిస్ట్రిబ్యూషన్ హక్కులు తమకే ఇవ్వాలని వారు గొడవ చేశారు. డిస్ట్రిబ్యూటర్లు తనపై దాడి చేసిన విషయంపై పూరి జగన్నాథ్ హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
వారిపై 323, 506, 384 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. లోఫర్ సినిమాలో నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ హీరోగా నటించాడు. హీరోయిన్గా దిశా పటానీ నటించింది. ఈ సినిమా నిరుడు డిసెంబర్లో భారీ అంచనాలతో విడుదలైంది. అయితే, బాక్సాఫీస్ వద్ద మాత్రం బోల్తా కొట్టింది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
Film distributors attacked director Puri Jagannath on Loafar cinema loss
Story first published: Saturday, April 16, 2016, 18:35 [IST]
Other articles published on Apr 16, 2016