Don't Miss!
- News barrelakka: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన బర్రెలక్క
- Sports IPL 2024: అందుకే పృథ్వీ షా ఆడటం లేదు: సౌరవ్ గంగూలీ
- Lifestyle గుడ్ ఫ్రైడే 2024 ఎప్పుడు? క్రైస్తవులు గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారు?మీకు తెలియని కొన్ని వాస్తవాలు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నాగ చైతన్య ‘దోచేయ్’ : చివరి 30 నిమిషాలు సూపర్
హైదరాబాద్: నాగ చైతన్య నటించిన ‘దోచేయ్' మూవీ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. సినిమా విడుదలకు ముందే నాగ చైతన్య ఫాదర్ నాగార్జున ఈ చిత్రం స్పెషల్ షో వీక్షించారు. సినిమా చూసిన అనంతరం నాగార్జున్ సినిమా బావుందంటూ టీంను ప్రశంసించారు.
సినిమా గురించి నాగార్జున వివరిస్తూ...‘దోచేయ్ స్పెషల్ షో చూసాను. చాలా ఎంటర్టెనింగ్ మూవీ. చివరి 30 నిమిషాలు చాలా బావుంది' అంటూ సినిమా యూనిట్ సభ్యులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. సినిమా సూపర్ హిట్ అవుతుందని, చైతూ కెరీర్లో ఈ చిత్రం ప్రత్యేక స్థానం సంపాదించుకుంటుందని నమ్మకం వ్యక్తం చేసారు.
నాగ చైతన్య, కృతి సనన్ హీరో హీరోయిన్లుగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దోచెయ్'. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లిమిటెడ్ పతాకంపై భోగవల్లి బాపినీడు సమర్పణలో బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సన్నీ ఎం.ఆర్ సంగీతం అందించారు.
ఈ చిత్రంలో బ్రహ్మానందం, పోసాని కృష్ణముర ళి, రవిబాబు, రావు రమేష్ తదితరులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సన్నీ ఎం.ఆర్., సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ప్రసాద్., ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్., ఆర్ట్: నారాయణరెడ్డి., కో-ప్రొడ్యూసర్: భోగవల్లి బాపినీడు., నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్., కథ-స్ర్కీన్ప్లే-దర్శకత్వం: సుధీర్వర్మ.