Don't Miss!
- News హరిరామ జోగయ్య యూటర్న్-పవన్ తో పాటు కూటమికీ భారీ ఊరట..!
- Technology Google సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ ఇతర ఫోన్లకు కూడా వస్తోంది! ఫోన్ల లిస్ట్ ఇదే!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Automobiles సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
రాజశేఖర్తో శ్రీయ రొమాన్స్.. కన్ఫర్మ్ చేసేశారు
టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ తన తర్వాతి సినిమాను వీరభద్రం చౌదరి దర్శకత్వంలో చేయబోతున్నారు. విలక్షణ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈయన ఈ సారి ఓ వైవిద్యభరితమైన కథతో సిద్దమవుతున్నారట. అతి త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి రానుందని తెలుస్తోంది.
అయితే చిత్రంలో రాజశేఖర్ సరసన నటించేందుకు గాను పలువురు సీనియర్ హీరోయిన్స్ పేర్లు పరిశీలించిన చిత్రయూనిట్ చివరకు శ్రీయను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఆమెతో సంప్రదింపులు కూడా అయ్యాయని, కథ విన్న శ్రీయ వెంటనే ఓకే చెప్పిందని సమాచారం. ఓ వైపు హుందాగా, మరోవైపు గ్లామర్నూ ఒలికించే పాత్ర కాబట్టి శ్రియ, న్యాయం చేస్తుందని అంతా భావిస్తున్నారు.
ఇకపోతే ఈ వెటరన్ బ్యూటీ శ్రీయ.. బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వం వహిస్తున్న చిత్రంలోనూ నటించే చాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. సో శ్రీయ సెకండ్ ఇన్నింగ్స్ ఇక టాప్ స్టార్ హీరోలతో సాగనుందని స్పష్టమవుతోంది.
మరో వైపు రాజశేఖర్ ఖాతాలో 'గరుడవేగ' హిట్ తరువాత 'కల్కి' రూపంలో డిజాస్టర్ పడింది. దీంతో కాస్తంత గ్యాప్ తీసుకున్న రాజశేఖర్.. తన తదుపరి సినిమాపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ మేరకు 'అహ నా పెళ్ళంట', 'పూలరంగడు' సినిమాలకు దర్శకత్వం వహించిన వీరభద్రం చౌదరికి తన తదుపరి సినిమా బాధ్యతలను అప్పగించారు.