twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్‌ సాంగులో డిఎస్‌పి స్పెషల్ అప్పియరెన్స్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : తెర వెనక ఉండి పని చేసే దర్శకులు, నిర్మాతలు, మ్యూజిక్ డైరెక్టర్లు అప్పుడప్పుడూ సినిమాల్లో ఏదో సీన్లో లేదా సాంగులో.....స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన 'అత్తారింటికి దారేది' చిత్రంలో ఈ చిత్ర సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

    యూనిట్ సభ్యుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సినిమాలోని 'నిను చూడగానే' అనే సాంగులో పవన్ కళ్యాణ్, సమంతలతో కలిసి కనిపించనున్నారట దేవిశ్రీ. కాగా ఈ సినిమా ఆగస్టు 9న విడుదల కావాల్సి ఉండగా సమైక్య ఉద్యమం కారణంగా విడుదల నిలిచి పోయింది.

    పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న 'అత్తారింటికి దారేది' చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తుండగా సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేసారు. ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాల మరింత పెరిగాయి.

    ఈ చిత్రంలో నదియా, బోమన్ ఇరానీ, బ్రహ్మానందం, అలీ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లోకనిపించనున్నారు. సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

    English summary
    Attarintiki Daaredi starring Pawan Kalyan and Samantha. Devi Sri Prasad is the music director of this movie. Trivikram Srinivas is the director and BVSN Prasad is the producer of this big budget production. As per the latest information being heard, DSP will be seen in the song ‘Ninnu Chudagane’.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X