Don't Miss!
- Sports IPL 2024: ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్.. విధ్వంసకర బ్యాటర్ దూరం!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
‘డిజే’ ట్రైలర్ సరికొత్త రికార్డ్, బాహుబలి తర్వాత ఇదే...
‘డిజె’ ట్రైలర్ సరికొత్త రికార్డు నమోదు చేసింది. ట్రైలర్ విడుదలైన 24 గంటల్లో 7.4 మిలియన్ వ్యూస్ సాధించింది.
హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెడ్గే జంటగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన దువ్వాడ జగన్నాధమ్(డిజె) ట్రైలర్ సరికొత్త రికార్డు నమోదు చేసింది. ట్రైలర్ విడుదలైన 24 గంటల్లో 7.4 మిలియన్ వ్యూస్ సాధించింది. యూట్యూబ్, ఫేస్ బుక్లో కలిసి ఇంత భారీ రెస్పాన్స్ వచ్చింది. బాహుబలి తర్వాత అత్యధిక వ్యూస్ సాధించిన ట్రైలర్ గా సౌతిండియా రికార్డ్ నమోదు చేసింది.
ట్రైలర్ విషయంలో ఇంత రెస్పాన్స్ రావడం, సినిమాపై అంచనాలు మరింత పెరగడంతో బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రికార్డులు నమోదు చేసే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు.
డిజే
డిజె చిత్రాన్ని జూన్ 23న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సినిమాపై ఇటీవల ఓ వివాదం తెరపైకి రాగా.... దాన్ని క్లియర్ చేసి ఎలాంటి అడ్డంకులు లేకుండా సినిమా విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.
హరీష్ శంకర్
దర్శకుడు హరీష్ శంకర్ చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా ఇది. గబ్బర్ సింగ్ తర్వాత ఆయన మల్లీ ఆ రేంజి హిట్ కొట్టలేదు. ఈ సినిమాతో మళ్లీ తన సత్తా ఏమిటో నిరూపించుకుంటాననే కసితో ఈ సినిమా చేసారు.
దిల్ రాజు
ఇక హిట్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దిల్ రాజు ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నారు. సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో అందుకు తగిన విధంగానే సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
డిజే వివాదం: తగ్గిన హరీష్ శంకర్, పదాలను తొలగిస్తామని హామీ!
డిజే సినిమా గురించిన వివాదం, సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాల కోసం క్లిక్ చేయండి.