Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఈ సినిమాలో చంద్రబాబుని ఇమిటేట్ చేసాను : జీవీ.ప్రకాష్ కుమార్
సంగీత దర్శకుడిగానే కాదు యువనటుడు గా కూడా తమిళ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుంటున్న జీవీ.ప్రకాశ్కుమార్. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈయన తాజాగా నటించిన చిత్రం "ఎనక్కు ఇన్నోరు పేరు ఇరుక్కు" (నాకు ఇంకో పేరు ఉంది) ఈ నెలలోనే విడుదల కానుంది.
నటి ఆనంది నాయకిగా నటించిన ఈ చిత్రానికి "డార్లింగ్" ఫేమ్ శ్యామ్ ఆంటన్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈసినిమా ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి హీరో జీవీ.ప్రకాశ్ కుమారే సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శుక్రవారం సాయంత్రం స్థానిక ఎగ్మోర్లో గల రెడిసన్ హోటల్లో విలేకరుల సమావేశం నిర్వహించింది. ఇది వినోదంతో కూడిన యాక్షన్ కథా చిత్రంగా రానుంది అయితే ఇందులో తమిళ దివంగత నటుడు చంద్రబాబు నటనను అనుకరించే ప్రయత్నం చేశానని జీవీ.ప్రకాశ్కుమార్ తెలిపారు.
నటి ఆనంది మాట్లాడుతూ "త్రిష ఇల్లన్నా నయనతార" చిత్రం తరువాత జీవీతో మళ్లీ ఈ చిత్రంలో నటించడం సంతోషంగా ఉందన్నారు.ఇందులో ముఖ్య పాత్ర పోషించిన నటుడు వీటీవీ గణేశ్ మాట్లాడుతూ తాను ఇళయదళపతి విజయ్తో నటించిన తెరి చిత్రం 100 కోట్లు వసూలు చేసిందని, ఇప్పుడు జీవీతో నటించిన ఎనక్కు ఇన్నోరు పేర్ ఇరుక్కు చిత్రం 150 కోట్లు వసూలు చేస్తుందని చమత్కరించారు.