Don't Miss!
- News దేశంలో ఫస్ట్ టైమ్, పోలీసులకు ఏసీ హెల్మెట్లు, ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి, పండగే పండగ !
- Sports LSG vs CSK: రూ. కోట్లు పలికిన ఆ ఇద్దరిని తప్పించాం- రుతురాజ్
- Lifestyle ఇవి తింటే మీ జుట్టు చాలా బలంగా మారుతుంది.. బట్టతల కూడా రాదు..
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
దీపిక పదుకొనె, రణవీర్, భన్సాలీలపై ఎఫ్ఐఆర్ నమోదు
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనె, నటుడు రణవీర్ సింగ్, దర్శకుడు సంజయ్ లాలా భన్సాలీ, మరికొందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. 'రామ్ లీలా' చిత్రం ద్వారా వీరు కొన్ని వర్గాల మనో భావాలను దెబ్బతీస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో వారిపై ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది.
పవన్ శర్మ అనే న్యాయవాది అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో 'రామ్ లీలా' సినిమాకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసారు. 'నవంబర్ 15న విడుదలకు సిద్దంగా ఉన్న ఈచిత్రం యొక్క ఇటీవల విడుదలైన ప్రోమోలోని సన్నివేశాలు వివిధ వర్గాల మధ్య శతృత్వం పెంచే విధంగా ఉన్నాయని' పవన్ శర్మ ఆరోపించారు.
పవన్ శర్మ ఫిర్యాదును స్వీకరించిన కోర్టు దీనిపై విచారణ జరుపాలని పోలీసులు ఆదేశించింది. బాలీవుడ్ హాట్ హీరోయిన్ దీపిక పదుకొనె, యంగ్ హీరో రణవీర్ సింగ్ జంటగా సంజయ్ లీలా భన్సాలీ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'రామ్ లీలా'. ఇటీవల విడుదలైన ఈచిత్రం ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. నవంబర్ 15న సినిమా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.