Don't Miss!
- News జగన్ పై దాడి ఘటనలో మరో టర్నింగ్ ! వడ్డెర సంఘాల ఎంట్రీ..
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Sports సూర్య సిగ్గుపడాలి.. క్రీడాస్ఫూర్తిని మరిచి నీఛమైన పని!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
జెనీలియాకు వరసగా రెండు చేదు అనుభవాలు
జెనీలియాకు రీసెంట్ గా రెండు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. యూటీవీలో ప్రసారమవుతున్న 'బిగ్స్విచ్' కార్యక్రమం నుంచి జెనీలియాను తప్పించారు. అలాగే రామ్ హీరోగా ప్రారంభం అయిన రామ్ అండ్ జెన్నీ చిత్రం ఆగిపోయింది. ప్రారంభం నుంచీ ఈ కార్యక్రమానికి జెనీలియానే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. అయితే త్వరలో ప్రారంభం కానున్న 'బిగ్ స్విచ్-2' కార్యక్రమానికి కూడా జెన్నీనే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుందని అందరూ భావించారు. కాని నిర్వాహకులు మాత్రం భిన్నంగా ఆలోచించారు. ఈసారి కొత్తవారితో కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుంటున్నట్లు చెప్పి జెనీలియాకు షాక్ ఇచ్చారు. అయితే ఈ కార్యక్రమం మునుపటికి భిన్నంగా ఉంటుందని, అందుకే కొత్తవారితో కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుంటున్నట్లు యూటీవీ ప్రతినిధి నిల్ గాంధీ వెల్లడించారు.
గొప్పింటి పిల్లలు, పేదింటి పిల్లల నేపథ్యంలో సాగిన ఈ కార్యక్రమం మొదట్లో బాగానే అలరించినా రానురాను రేటింగ్స్ పడిపోయాయి.పోగ్రాం స్టార్టయిన ఏడాదిలోనే ఈ రేటింగ్స్ పడిపోవటానికి కారణాల గురించి చెబుతూ...'కార్యక్రమ నేపథ్యం(కాన్సెప్ట్) వ్యాఖ్యాతకంటే కూడా బాగా ఆకట్టుకుంది. అయితే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయామ'ని నిల్ పేర్కొన్నారు. అంటే ఇండైరక్ట్ గా జెనీలియా ఫెయిల్యూర్ అయిందనే చెప్తున్నట్లేగా. ఇక జెనీలియా ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఆరెంజ్ అనే చిత్రం చేస్తోంది. రామ్ చరణ్ హీరోగా చేస్తున్న ఆ చిత్రాన్ని నాగబాబు నిర్మిస్తున్నారు.