Don't Miss!
- News తండ్రైన ముఖ్యమంత్రి: తొలి నేతగా రికార్డ్
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఈ సంవత్సరం గొల్లపూడి శ్రీనివాస్ అవార్డుకి ఎంపికైన చిత్రం
తొలి చిత్రంతోనే సంచలనాలు సృష్టించిన నవ దర్శకులను సత్కరించే గొల్లపూడి శ్రీనివాసరావు అవార్డు ఈ సంవత్సరం హిందీ దర్శకురాలు అనుష రిజ్వీ దక్కించుకుంది. అమీర్ ఖాన్ నిర్మాణ సారద్యంలో రైతుల ఆత్మహత్యల నేపద్యంలో తెరకెక్కిన పిప్లి లైవ్ చిత్రానికి గాను ఆమె ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. దేశ వ్యాప్తంగా 16 చిత్రాలు పోటి పడగా వారిలో అనుష ఎంపికయ్యారు. అవార్డు కింద 1.50 లక్షల నగదు జ్ఞాపిక అందజేస్తారు. ఆగుస్ట్ 12 న చెన్నై లో జరిగే కార్యక్రమంలో అవార్డు ప్రదానం జరుగుతుంది. నటుడు రచయత గొల్లపూడి మారుతిరావు అయన కుమారుడు గొల్లపూడి శ్రీనివాస్ స్మృత్యర్ధం తోలి సినిమాతోనే ప్రతిభ కనబరిచిన దర్శకులకు ప్రతి సంవత్సరం ఈ అవార్డు ప్రదానం చేస్తున్నారు. ఎన్ డి టివిలో జర్నలిస్టుగా ఉన్న అనూష రిజ్విని దర్శకత్వంలో అమీర్ ఖాన్ 'పీప్లి లైవ్' అనే సినిమాను నిర్మించారు. రైతుల ఆత్మహత్యలు..రాజకీయ నాయకుల ఓదార్పులు..వాటిపై మీడియా కథనాలు..వీటి చుట్టూ అల్లుకొన్న కథ ఇది. ఈ చిత్రంలో రఘుబీర్ యాదవ్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, మలైకా షెనాయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.