Don't Miss!
- News సీఎం, డీసీఎంకు కోర్టు సమన్లు, లోక్ సభ ఎన్నికల టైమ్ లో యువరాజుకు కోర్టు సమన్లు, అందుకే!
- Sports రోహిత్ శర్మ ప్లేస్లో..!!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కీరవాణి మెడకు జీఎస్టీ ఉచ్చు.. నోటీసులు జారీ.. విచారణకు ఏర్పాట్లు
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించిన గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ (జీఎస్టీ) వెబ్ డాక్యుమెంటరీ వివాదంలో ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఇరుక్కుపోయాడు. భారతీయ చట్టాలకు వ్యతిరేకంగా జీఎస్టీని వర్మ రూపొందించారనే ఆరోపణలపై వర్మకు నోటీసులు జారీ చేసి విచారించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో జీఎస్టీకి సంగీతం వహించిన కీరవాణికి కూడా నోటీసులు జారీ చేయడం ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది.
Recommended Video
జీఎస్టీ వివాదంలో కీరవాణి
బాహుబలి లాంటి ప్రతిష్టాత్మకం చిత్రానికి సంగీతం అందించిన కీరవాణి వర్మ జీఎస్టీకి కూడా మ్యూజిక్ అందించాడు. జీఎస్టీకి సంగీతం అందించడంపై కీరవాణిపై కొందరు ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేశారు. అయితే జీఎస్టీ విడుదలకు ముందు, ఆ తర్వాత ఈ వెబ్ డాక్యుమెంటరీ అనేక వివాదాల్లో కూరుకుపోయింది.
వర్మ విచారణ నేపథ్యంలో
జీఎస్టీ వెబ్ డాక్యుమెంటరీ భారతీయ చట్టాలకు వ్యతిరేకంగా సినిమా రూపొందించారనే ఫిర్యాదులు పోలీసులకు అందాయి. అంతేకాకుండా, పలు చానెల్స్ చర్యా కార్యక్రమం సందర్బంగా తమపై అభ్యంతర వ్యాఖ్యలుచేసి దూషించాడని సామాజిక కార్యకర్త దేవీ, మణి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో దర్శకుడు రాంగోపాల్ వర్మను సీసీఎస్ పోలీసులు ఇటీవల విచారించారు.
కీరవాణి మెడకు జీఎస్టీ
వర్మ వివాదం ఓ వైపు కొనసాగుతుండగానే జీఎస్టీ వ్యవహారం సంగీత దర్శకుడు కీరవాణి మెడకు చుట్టుకొన్నది. ఇప్పటికే వర్మను విచారించిన పోలీసులు కీరవాణి విచారించి అనేక ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేందుకు సీసీఎస్ సిద్దమవుతున్నది.
చిత్ర యూనిట్ సభ్యులకు కూడా
జీఎస్టీ చిత్రానికి పనిచేసిన వర్మ అసిస్టెంట్లకు కూడా నోటీసులు జారీ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. ఈ కేసుకు సంబంధించిన ప్రతీ ఒక్కరిని విచారించే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలిసింది.
వర్మ అరెస్టుకు రంగం సిద్ధం
జీఎస్టీకి వీడియో కాలింగ్ యాప్ స్కైప్ ద్వారా డైరెక్షన్ చేశానని వర్మ చెప్పిన విషయంపై సీసీఎస్ పోలీసులు దృష్టిపెట్టినట్టు తెలుస్తున్నది. వర్మ పోలెండ్కు వెళ్లాడా? లేక ఇండియాలోనే జీఎస్టీ షూట్ చేశాడా అనే కోణంలో విచారణ చేపట్టారు. అంతేకాకుండా వర్మ నేరం చేశాడని పక్కా సాక్ష్యాలు సేకరించిన పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారని సమాచారం.