Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
గుణశేఖర్ తరువాతి చిత్రం.. 150 కోట్ల బడ్జెట్తో!
దర్శకుడు గుణశేఖర్ పేరు చెప్పగానే ఒక్కడు, చూడాలనిఉంది వంటి చిత్రాలు గుర్తుకు వస్తాయి. భారీ సెట్స్ ఉపయోగించి ఆడియన్స్ ని ఆకట్టుకోవడంలో ఈ దర్శకుడిది ప్రత్యక శైలి. కొన్ని పరాజయాల తరువాత కెరీర్ జోరు తగ్గుతున్న సమయంలో ఈ దర్శకుడు రుద్రమ దేవి చిత్రంతో తన ప్రతిభ నిరూపించుకున్నాడు. కానీ సరైన విజయం అందుకోవాలనేది ఈ సీనియర్ దర్శకుడి కోరిక.
గుణశేఖర్ ప్రస్తుతం ఓ భారీ చిత్రానికి ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పురాణ గాధ హిరణ్యకశిపుడు చిత్రాన్ని తెరకెక్కించేందుకు గుణశేఖర్ సన్నాహకాలు చేస్తున్న వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రానా నటిస్తాడని కూడా ప్రచారం జరుగుతున్నా అధికారికంగా ప్రకటించలేదు.
పురాణం గాధల్ని తెరకెక్కించిన అనుభవం గుణశేఖర్ కు ఉంది. గతంలో గుణశేఖర్ బాల రామాయణం చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం హిరణ్యకశిపుడు చిత్రాన్ని భారీ స్థాయిలో 150 కోట్ల బడ్జెట్ తో రూపొందించే ఆలోచనలో గుణశేఖర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ ప్రాజెక్ట్ మరిన్ని విషయాలు త్వరలోనే తెలుస్తాయి.