Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
నేను దేవున్ని నమ్మను: కమల్ హాసన్
హైదరాబాద్: ‘చీకటి రాజ్యం' సినిమా ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్ వచ్చిన కమల్ హాసన్ మీడియాకు వరుస పెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. రాజేష్ సెల్వ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తెలుగులో నవంబర్ 20న విడుదలువుతోంది. వాస్వానికి నవంబర్ 12న విడుదల కావాల్సి ఉన్నా.... ‘అఖిల్' మూవీ విడుదల నేపథ్యంలో నాగార్జున విజ్ఞప్తి మేరకు వాయిదా వేసారు.
ఇంటర్వ్యూలో ఆయనకు వివిధ అంశాల గురించి ప్రస్తావించారు. తక్కువ టైమ్లో నాణ్యమైన చిత్రాల్ని చేయాలనే ఉద్దేశ్యంతో వరుసగా సినిమాలు చేస్తున్నాను. దర్శకత్వంపై దృష్టిపెడితే నటనకు పూర్తిగా న్యాయం చేయలేమోనని ప్రస్తుతం డైరెక్షన్కు దూరంగా వుంటున్నాను అన్నారు.
అందరూ అనుకుంటున్నట్లుగా రీమేక్ కథల్ని తెరకెక్కించడం అంత సులభమైన విషయం కాదు. అందరికీ తెలిసిన కథని అర్థవంతంగా ఆవిష్కరించాలంటే మరింత శ్రమ పడాల్సివుంటుంది. జేమ్స్బాండ్ సినిమాను రీమేక్గా ఎంచుకొని దాని ఒరిజినల్ మ్యాజిక్ను రిపీట్ చేయడం సాధ్యమయ్యే పనికాదు అన్నారు.
నేను దేవుణ్ణి నమ్మను. అందుకే పౌరాణిక చిత్రాలపై మొదటి నుంచి ఆసక్తిని పెంచుకోలేదు. రామాయణ కథతో లంకేశ్వర చిత్రాన్ని తీయాలని ఒకప్పుడు అనుకున్నాను. అనుకోని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు అన్నారు. త్వరలో ఓ స్ట్రెయిట్ తెలుగు చిత్రాన్ని చేయబోతున్నాను. ఈ చిత్రానికి రాజీవ్కుమార్ దర్శకత్వం వహిస్తారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాల్ని త్వరలో ప్రకటిస్తాం అన్నారు.
డబ్బు సంపాదించడానికి, ప్రతిభను పెంపొదించుకోవడానికి, విజయాన్ని సాధించడానికి షార్ట్కట్లు లేవు. సుదూరమైన లక్ష్యాన్ని చేరుకోవడానికి చాలా దూరం ప్రయాణం చేయాల్సివుంటుంది. దగ్గరి దారులు వెతుక్కుంటే లక్ష్యం కనుమరుగయ్యే ప్రమాదం వుంటుంది.
సినిమాలకు భాషా భేదాలు వుండకూడదు. జాతీయ స్థాయిలో సినిమాలకు ఒకేరకమైన విధి విధానాలుండాలి. నేషనల్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ను మేఘాలయాలో నెలకొల్పి అన్ని ప్రాంతాల వారికి శిక్షణ ఇవ్వాలి. అప్పుడే ఒక భాష వారు మరొక భాషా చిత్రాల్ని రూపొందించవచ్చు. తెలంగాణవారు తమిళ చిత్రాల్ని, ఒరిస్సా వారు తమిళ చిత్రాల్ని తీసే వెసులుబాటు లభిస్తుంది.