Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
కొత్త టాలెంట్: డాడీ, బాబాయ్ రూట్లో రామ్ చరణ్!
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యాక్టింగులో, ఫైటింగుల్లో, డాన్సింగుల్లో తన టాలెంటు ఏమిటో ఇప్పటికే నిరూపించుకున్నాడు. గుర్రపుస్వారీలో కూడా తన పెర్ఫార్మెన్స్ అదరగొట్టాడు. తాజాగా రామ్ చరణ్ తేజ్ మరో విషయంలో కూడా తన టాలెంటు నిరూపించుకోబోతున్నాడు. ఆ సారి రామ్ చరణ్ పాటలు పాడటంపై దృష్టి సారించాడు.
ఇటీవల ఇంటర్వ్యూలో రామ్ చరణ్ మాట్లాడుతూ....చిన్న తనంలో సంగీతం క్లాసులకు వెళ్లేవాడినని, అయితే అంత సీరియస్గా నేర్చుకోలేదని తెలిపారు. తిరుపతిలో జరిగిన ప్రజారాజ్యం పార్టీ ఆవిష్కరణ సభ ప్లే చేసిన 'ప్రజా రాజ్యం మాదే' అనే పాటలో గొంతు కలిపాను. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ పాడలేదు. రాబోయే నా సినిమాల్లో తప్పకుండా మళ్లీ పాట పాడుతా' అని చరణ్ వెల్లడించారు.
చరణ్ తండ్రి చిరంజీవి కూడా తన సినిమాల్లో పలు పాటలు పాడిన సంగతి తెలిసిందే. మాస్టర్, మృగరాజు తదితర సినిమాల్లో చిరంజీవి పాడిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే విధంగా చరణ్ బాబాయ్ పవన్ కళ్యాణ్ తన సినిమాల్లో పాటలతో అదగొడుతుండటం తెలిసిందే. ఇపుడు రామ్ చరణ్ కూడా వారి దారిలో ప్రయాణిస్తూ.....తన సింగింగ్ టాలెంట్ నిరూపించుకోవాలని ఆశ పడుతున్నాడు.
ఇక పోతే....రామ్ చరణ్ నటించిన 'ఎవడు' సినిమా ఈ నెల 12న విడుదలైన బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలు సాధిస్తోంది. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్వకత్వం వహించారు. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మించారు. ఈచిత్రంలో శృతి హాసన్, అమీ జాక్సన్ హీరోయిన్లు. అల్లు అర్జున్, కాజల్ అతిథి పాత్రల్లో నటించారు.