Don't Miss!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ముద్దు సీన్: డైరెక్టర్పైకి తోసేస్తున్న మహేష్ హీరోయిన్
ముంబై: మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన '1' చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయమైన భామ క్రితి సానన్. తొలి చిత్రం ప్లాపయినప్పటికీ బాలీవుడ్లో అవకాశాలు దక్కించుకుంది. జాకీ ష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్ హీరోగా తెరకెక్కుతున్న 'హీరోపంటి' అనే చిత్రంలో నటిస్తోంది.
ఈ చిత్రంలో హీరో హీరోయిన్ల మధ్య ఘాటైన ముద్దు సీన్ ఉంది. ఈ విషయమై క్రితి సానన్ మాట్లాడుతూ....'నాకు ముద్దు సీన్లు చేయడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే నేను సాంప్రదాయ కుటుంబం నుండి వచ్చారు. తొలుత దర్శకుడు నా వద్దకు ఈ ప్రతి పాదనను తెచ్చినపుడు నిర్మొమహాటంగా తిరస్కరించాను' అని తెలిపింది.
అయితే సినిమాకు ఆ ముద్దు సీన్ ఎంతో ముఖ్యమైనదని దర్శకుడు సబ్బీర్ ఖాన్ తెలిపారు. సీన్ డిమాండ్ చేయడం వల్ల ఇష్టం లేకున్నా ముద్దు సీన్లో నటించాను. సినిమా రంగంలో వచ్చినప్పుడు పర్సనల్ అభిప్రాయాల గురించి కాకుండా ప్రొఫెషనల్గా ఆలోచించాలి. అందుకే ఆ సీన్ చేసాను అని తెలిపింది.
దీంతో పాటు ఆమె మరన్ని సినిమా అవకాశాలు కూడా దక్కించుకుంది. బాలీవుడ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ప్రముఖ ఫిలింమేకర్ సాజియ్ నదియద్ వాలా ఆమెకి మూడో సినిమా ఆఫర్ చేశాడని టాక్. ' హీరో పంటి ' మూవీలో ఆమె పర్ఫార్మెన్స్ నచ్చడంతో తన తర్వాతి సినిమా అయిన ' హౌజ్ ఫుల్-3 ' మూవీ సీక్వెల్లో నటించడానికి అవకాశం ఇచ్చాడట.