Don't Miss!
- News Telangana Loksabha Polls 2024:కేసీఆర్ కుటుంబాన్ని ఆ భయం వెంటాడుతోందా....!!
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Finance IT News: రిక్రూట్మెంట్ రూటు మార్చిన ఇన్ఫోసిస్.. టాటా Elxsi న్యూ హైరింగ్..
- Lifestyle May Day 2024 Wishes : శ్రామికులు లేనిదే అభివృద్ధి లేదు.. శ్రామికుల దినోత్సవ శుభాకాంక్షలు
- Sports ధోనీకి కోపం వచ్చింది.. భయపడిన కెమెరామెన్ Video
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
‘గబ్బర్ సింగ్’ రికార్డ్ స్మాష్ అయిపోవాల...!
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'గబ్బర్ సింగ్' చిత్రం ఏ రేంజిలో ఎంటర్ టైన్మెంట్ పంచిందో ప్రత్యేకంగా చెక్కర్లదు. ఫుల్ ఎంటర్ టైన్మెంట్ ఎలిమెంట్స్తో రూపొందిన ఈచిత్రం పవర్ స్టార్ కెరీర్లోనే కాదు.. తెలుగు సినిమా పరిశ్రమలోనే బిగ్గెస్ట్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
అయితే 'గబ్బర్ సింగ్' రికార్డును స్మాష్ చేసేందుకు వస్తున్నాడు మరో దర్శకుడు. అతనెవరో కాదు క్రేజీ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న పూరి జగన్నాథ్. పవన్ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి. దానయ్య నిర్మించే చిత్రం చిత్రం 'కెమెరామేన్ గంగతో రాంబాబు'.
ఈ చిత్రం పూరి కెరీర్లోనే అత్యంత వినోదాత్మక చిత్రంగా నిలుస్తుంది. సినిమా మొదటి నుంచి చివరి దాకా కామెడీ, యాక్షన్, రొమాంటిక్ ఎలిమెంట్లతో అత్యంత వినోదాత్మకంగా రూపొందుతోందని పూరి సన్నిహితులు అంటున్నారు. ఈ చిత్రం తప్పకుండా గబ్బర్ సింగ్ను బీట్ చేస్తుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నాడట దర్శకడు. పవన్ అభిమానులు కూడా పూరి చిత్రాన్ని అద్భుతంగా తరకెక్కిస్తారనే నమ్మకంతో ఉన్నారు.
పవన్ సరసన తమన్నా హీరోయిన్గా నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఆడియోని సెప్టెంబర్ 21న విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 11న ఈచిత్రం విడుదల కానుంది. ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్, శేఖర్, ఫైట్స్: విజయ్, స్టిల్స్: మాగంటి సాయి, కో డైరెక్టర్: విజయరామ్ ప్రసాద్, నిర్మాణం యూనివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డివివి దానయ్య, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్.