Just In
- 5 hrs ago
అందుకే ఆ టైటిల్ పెట్టాం.. ‘చెప్పినా ఎవరూ నమ్మరు’పై హీరో కమ్ డైరెక్టర్ కామెంట్స్
- 6 hrs ago
పబ్లిక్ ప్లేస్లో ఘాటు ముద్దులు.. లిప్ కిస్తో భర్తతో శ్రియ రచ్చ
- 6 hrs ago
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- 6 hrs ago
శ్రీను వైట్ల ఓ శాడిస్ట్.. మంచు విష్ణు సెన్సేషనల్ కామెంట్స్
Don't Miss!
- News
మెజార్టీ ఉంటే ప్రజలను చంపాలని కాదు.. మోదీపై దీదీ గుస్సా..
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్ను చేయండి: క్లార్క్
- Automobiles
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
త్వరలో బాలయ్యతో 101వ సినిమా, ఇంతలో సాయిపై ఐటి దాడులు
హైదరబాద్: ప్రముఖ సినీ నిర్మాత సాయి కొర్రపాటి ఆఫీస్పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. మణికొండలోని వారాహి చలనచిత్రం ఆఫీస్పై ఐటీ అధికారులు రెండు బృందాలుగా సోదాలు నిర్వహించారు. సాయి కొర్రపాటి ఆదాయానికి సంబంధించిన పన్నులు సరిగా చెల్లించడం లేదని ఆరోపణలు రావడంతో సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. అయితే ఎలాంటి అక్రమ ఆస్తులు లభించలేదని సమాచారం.
సాయి కొర్రపాటి సినిమాల విషయానికొస్తే... త్వరలో బాలయ్యతో(101)వ సినిమా ఆయన భారీ బడ్జెట్ తో 'రైతు' అనే సినిమా తీయబోతున్నారు. మరో వైపు ఆయన నిర్మించిన 'జ్యో అచ్చుతానంద' సినిమా ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది. ఫ్యామిలీ ఎంటర్టెనర్ గా పేరు తెచ్చుకోవడంతో మెల్లిమెల్లిగా కలెక్షన్లు పెరుగుతున్నాయి.

జ్యో అచ్చుతానంద సినిమాని తొలి నుంచి చివరి వరకూ ఫన్ చేస్తూ నడిపించాడు దర్శకుడు అయితే ఫన్ జరుగుతున్న సమయంలో కూడా తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తిని నిలపెట్టగలగిగాడు. అంతేకాని మైండ్ లెస్ కామెడీ చేయలేదు. లైట్ హార్టెడ్ గా సీన్స్ ని పేర్చుకుంటూ నడిపించేసాడు.
సినిమాలో అవసరాల చేసిన స్కీన్ ప్లే మ్యాజిక్ మనలని కట్టిపారేస్తుంది. ముఖ్యంగా కీ రోల్ ..జ్యో కథని హీరోలైన అన్నదమ్ములిద్దరూ వాళ్ల భార్యల ముందు ఎవరికి తోచినట్టుగా వాళ్లు చెబుతారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసినప్పుడు అదే కథ మరో కోణంలో తెరపై కనిపిస్తుంది. ఆ లెక్కన ఒకే సన్నివేశాన్ని తెరపై మూడుసార్లు చూడాల్సొస్తుంది. కానీ మనకు ఎక్కడా బోర్ కొట్టనివ్వడు.