Don't Miss!
- News TTD: తిరుమలలో ఆ సేవలు రద్దు, శ్రీరాముడి ఊరేగింపుకు ప్రత్యేక ఏర్పాట్లు
- Sports Gautam Gambhir: నిద్రలో కూడా ఆర్సీబీనే కలవరిస్తా..! వీడియో
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Ustaad Bhagat Singh నిర్మాతలకు ఐటీ షాక్.. మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీసులో రైడ్స్!
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు అగ్రనిర్మాణ సంస్థగా కొనసాగుతున్న మైత్రి మూవీ మేకర్స్ ప్రముఖ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే సినిమా పనుల్లో బిజీగా ఉండగా సోమవారం రోజు హఠాత్తుగా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ జరగడం హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాదులో ఉన్నటువంటి మైత్రి మూవీ మేకర్స్ ఆఫీసులో ఆదాయపు పన్ను శాఖ అధికారులు గ్యాప్ లేకుండా సోదాలు నిర్వహించారు.
ఇటీవల మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ లోకి కూడా అడుగుపెట్టింది. ఇక ఈ సంస్థలో సంక్రాంతికి రెండు భారీ బడ్జెట్ సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య అలాగే నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి రెండు సినిమాలను కూడా మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్లో నిర్మించింది. ఇక ఈ రెండు సినిమాలను కూడా నైజాంలోనే సొంతంగా విడుదల చేసుకుంటుంది. అయితే ఈ క్రమంలో సంస్థపై ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అధికారులు ఐటీ సోదాలు నిర్వహించారు.
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఐటీ అధికారులు ఉదయం 9 గంటలకు మైత్రి ఆఫీసుకు చేరుకొని GST సోదాలు మొదలుపెట్టారు. ఇక ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం అయితే పలువురు ఎన్నారైలు కూడా ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇక పొలిటికల్ ఇన్వెస్ట్ మెంట్ లు కూడా మైత్రి మూవీ మేకర్స్ లో ఉంటాయని కూడా టాక్ వచ్చింది. ఇక ఈ సంస్థపై ఐటి ఫోకస్ చేస్తుందని గతంలో కొన్ని కథనాలు కూడా వెలువడ్డాయి.
ఇటీవల పూరి జగన్నాథ్ నిర్మించిన లైగర్ సినిమా వ్యాపారంలో కూడా అవకతవకలు జరిగాయని ఆరోపణలు రాగా అధికారులు వారిని కూడా విచారించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కొందరైపై పలువురు రాజకీయ నాయకుల బ్యాక్ గ్రౌండ్లో బ్లాక్ మనీతో కూడా బిజినెస్ వ్యవహారాలు కొనసాగుతున్నాయి అని ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ తరుణంలో సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖ నిర్మాతలపై కూడా ఐటి ఫోకస్ చేసిందని టాక్ అయితే వచ్చింది. ఇప్పుడు హఠాత్తుగా మైత్రి మూవీ మేకర్స్ పై సోదాలు నిర్వహించడంతో టాలీవుడ్ సినీ ప్రముఖులు ఒక్కసారిగా అలెర్ట్ అయ్యారు. మరి ఈ విషయంలో మైత్రి మూవీ మేకర్స్ ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి.