Don't Miss!
- Sports DC vs SRH: ట్రావిస్ హెడ్ అన్స్టాపబుల్.. 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ!
- News మోదీ కరుణించిన ఎన్నికల కమీషన్ షాక్ ఇచ్చింది, తిరుగులేని నాయకుడికి రివర్స్ గేర్ !
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
దిల్ రాజు చెప్పగానే పారిపోయా.. దానిగురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది: సమంత
నిన్న (శనివారం) జరిగిన 'జాను' ప్రీ రిలీజ్ ఈవెంట్లో అక్కినేని కోడలు, స్టార్ హీరోయిన్ సమంత మాట్లాడిన మాటలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాయి. ఓ వైపు జాను మూవీ గురించి చెబుతూనే మరోవైపు దిల్ రాజు, శర్వానంద్ లపై కామెంట్స్ చేసింది సమంత. మరి వాళ్లపై సామ్ కామెంట్స్ ఏంటనే దానిపై ఓ లుక్కేద్దామా..
96 రీమేక్.. సమంత, శర్వానంద్ జోడీ
తమిళ నాట విడుదలై మొత్తం దక్షిణాదిని ఓ ఊపు ఊపిన 96 చిత్రానికి రీమేక్ సినిమాగా 'జాను' ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సినిమాలో సమంత, శర్వానంద్ లీడ్ రోల్స్ పోషించారు. ఒరిజినల్ను రూపొందించిన సి. ప్రేమ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. దిల్ రాజు నిర్మించారు. ఫిబ్రవరి 7న 'జాను' రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారు.
జాను ప్రీ రిలీజ్ ఈవెంట్.. స్పెషల్ గెస్ట్
ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్ వేగవంతం చేసిన చిత్రయూనిట్.. శనివారం నాడు హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ వేడుకకు హీరో హీరోయిన్లతో పాటు నేచురల్ స్టార్ నాని, వంశీ పైడిపల్లి ముఖ్య అతిథులుగా హాజరై సందడి చేశారు.
ఎప్పటికీ అదే మోడ్.. ఏ ఒక్కరినీ డిజప్పాయింట్ చేయకూడదని!
ఈ వేదికపై సమంత మాట్లాడుతూ.. తన సక్సెస్ సీక్రెట్ బయటపెట్టింది. తాను ప్రతి సినిమాకు ఏ ఒక్కరినీ డిజప్పాయింట్ చేయకూడదని భయపడుతూనే ఉంటానని.. అందుకే ప్రతి సినిమాను తన మొదటి సినిమాగానే భావిస్తానని తెలిపింది సామ్. ప్రతీ సినిమా షూటింగ్ స్పాట్లో అది తన తొలి సినిమా అనే మోడ్ లోనే ఉంటానని సమంత చెప్పింది.
దానిగురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది
''తమిళ్ సూపర్ హిట్ మూవీ ‘96'ను తెలుగులో ‘జాను' పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని అనుకుంటున్నా. కానీ ఫిబ్రవరి 7 తరువాత ఖచ్చితంగా మాట్లాడతా. ప్రతిరోజు నేను ప్యాకప్ చెప్పిన తర్వాత ఓ మ్యాజిక్ జరిగినట్టే భావించా. ఆ మ్యాజిక్ ఏంటన్నది ఫిబ్రవరి 7న థియేటర్స్లో మీరే చూస్తారు'' అని తెలిపింది సామ్.
దిల్ రాజు చెప్పగానే పారిపోయా..
ఇక ఈ సినిమా చేయాలని దిల్ రాజు మొదట్లో చెప్పినప్పుడు పారిపోయానని, అయినప్పటికీ ఆయన వెంటపడి మరీ తనను ఒప్పించారని సమంత చెప్పింది. ఆయన వల్లే ఇంత మంచి సినిమా చేయగలిగాను. ఈ సినిమాలో నా రోల్ బాగా పండింది అంటే అది హీరో శర్వానంద్ వల్లనే. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది అంటూ సమంత పలు విషయాలు చెప్పింది.