Don't Miss!
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రామ్ చరణ్ సారీ చెప్పాలంటూ రాజశేఖర్ డిమాండ్
శ్రీకాళహస్తి దేవాలయం వద్ద వారి కుమార్తెలతో కలసి రాహు, కేతు పూజలు నిర్వహించిన అనంతరం ఉభయులూ మీడియాతో మాట్లాడారు. రామ్చరణ్ తేజ భద్రతా సిబ్బంది పట్టపగలు ఇద్దరు వ్యక్తులపై దాడి చేయటం పట్ల తీవ్రమైన అభ్యంతరం తెలిపారు. యువ హీరో బేషరతుగా క్షమాపణ చెప్పాలని పట్టుబట్టారు.
''అభిమానులు అనే వాళ్ళు ఉంటేనే ఒక హీరో లేకుంటే సినీ పరిశ్రమ మనుగడ సాగిస్తుంది. ఆ సంఘటన అవాంఛనీయమైనది. ఎవరికీ మంచిది కాదు'' అని రాజశేఖర్ అభిప్రాయపడ్డారు.
అనంతరం చిరంజీవిపై విమర్శలు చేశారు. పార్టీలో ఆయన(చిరంజీవి) చేరికతో కాంగ్రెస్కు ఒరిగిందేమీ లేదని రాజశేఖర్ పేర్కొన్నారు. ''ఒక కులం పేరుతో లబ్ది పొందేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు'' అని రాజశేఖర్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తగా మాత్రమే పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు.
సినీ నటులు రాజకీయాల్లో విజయం సాధించలేరంటూ కొందరు నేతల వ్యాఖ్యలకు సంబంధించి అలాంటి వ్యాఖ్యలను తాను సమర్ధించనని చెప్పారు. ''దివంగత ఎన్టీ రామారావు, ఎవ్జీుఆర్, అంతెందుకు ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రి జె.జయలలిత లాంటి సినీ నటులు విజయవంతమైన నేతలుగా రాణించారు'' అని రాజశేఖర్ పేర్కొన్నారు.