Don't Miss!
- News కేసీఆర్ భరోసా: 22 నుంచి బస్సు యాత్రతో జనంలోకి
- Sports భార్య పేరు చెప్పి.. DK నోరు మూయించిన కోహ్లి Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
‘ఊసరవెల్లి’ నెగెటివ్, కానీ...: జూ ఎన్టీఆర్
ఊసరవెల్లి అంటే.. చాలా మంది నెగెటివ్ గా ఆలోచిస్తారు. రంగులు మార్చి మోసం చేసే రకం అంటుంటారు. పాపం అది సాదు జంతువే అయినా అది బ్రతకడం కోసం రంగులు మార్చక తప్పని పరిస్థితి.....మరి 'ఊసరవెల్లి" సినిమాలో హీరో ఎందుకు మార్చాడో? థియేటర్లో చూడాల్సిందే....అన్నారు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఈ నెల 6న తన సినిమా విడుదల సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన ప్రెస్ మట్ లో జూనియర్ మాట్లాడారు. రంగులు మార్చినంత మాత్రాన చెడ్డ వారు కాదని, మంచి పనులు చేయడానికి కూడా ఒక్కోసారి రంగులు మార్చక తప్పదు అన్నారు.
తనకు విజయదశమి సినిమా బాగా కలిసొచ్చిందని, తన తొలి సినిమా స్టూడెంట్ నెంబర్ నె.1 సెప్టెంబర్ 27న విడులై సూపర్ హిట్టయింది. బృందావనం కూడా పోయిన దసరాకు విడుదలై మంచి విజయం సాధించింది. అదే తరహాలో ఊసరవెల్లి సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. దర్శకుడి సుందర్ రెడ్డితో పాటు అంతా చాలా కష్ట పడి పని చేశారని, ప్రేక్షకులు సినిమా చూసిన తర్వాత పూర్తిగా సంతృప్తి చెందుతారన్నాడు. దయచేసి ఎవరూ పైరసీని ప్రోత్సహించవద్దని, అంతా థియేటర్లోనే సినిమాలు చూడాలని కోరారు. దర్శకుడు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ....అసలు ఊసరవెల్లి టైటిల్ ను తారక్ ఒప్పుకుంటాడని అనుకోలేదు, సినిమా బాగా వచ్చింది, ఎన్టీఆర్ నుంచి ప్రేక్షకులు ఏమి కోరుకుంటున్నారో అన్ని ఈ సినిమాలో ఉంటాయన్నారు. ఈ సమాశంలో నిర్మాత చత్రపతి ప్రసాద్ తో పాటు, ఇతర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.