Don't Miss!
- News కాంగ్రెస్ సర్కారును టచ్ చేస్తే..: బీజేపీ, బీఆర్ఎస్లకు సీఎం రేవంత్ హెచ్చరిక
- Sports LSG vs CSK: ధోనీ పవర్ హిట్టింగ్.. మెరిసిన జడేజా
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
దర్శకుడు గుణశేఖర్కి కె.వి.రెడ్డి అవార్డ్
హైదరాబాద్: యువ కళావాహిని ఆధ్వర్యంలో సాంస్కృతికబంధు సారిపల్లి కొండలరావు సారథ్యంలో ప్రతి ఏటా జగదేకదర్శకుడు కె.వి.రెడ్డి పేరుమీద ప్రధానం చేస్తున్న చలనచిత్ర దర్శక పురస్కారం ఈ సారి ప్రముఖ తెలుగు దర్శకుడు గుణశేఖర్ అందుకోబోతున్నారు.
ఈ 30వ చలనచిత్ర దర్శక పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమం బంజారాహిల్స్ లోని ప్రసాద్ పిలింల్యాబ్ లో ఈ నెల 13న(ఆదివారం) సాయంత్రం 6 గంటలకు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత, దర్శకరత్న దాసరి నారాయణరావు హాజరవుతున్నారు.
విశిష్ఠ అతిథిగా ప్రసాద్ ఫిలింల్యాబ్ అధినేత అక్కినేని రమేష్ ప్రసాద్ హాజరవుతున్నారు. ఈ అవార్డు ప్రధానోత్సవ సభకు సారిపల్లి కొండలరావు అధ్యక్షత వహించనున్నారు. గౌరవ అతిథులుగా చలసాని అశ్వినీదత్, పరుచూరి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాలకృష్ణ, తనికెళ్ల భరణి, , జివి. నారాయణరావు, యం.వి.ఎస్ హరనాథరావు, యం దివాకరబాబు, తోట ప్రసాద్, ఎ.కె.అయ్యంగార్ హాజరవుతున్నారు.
అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం ప్రారంభానికి ముందుగా అంటే మధ్యాహ్నం 3.15 గంటలకు గుణశేఖర్ దర్శకత్వం వహించిన ‘రుద్రమదేవి' చిత్రాన్ని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో ప్రదర్శించబోతున్నారు.