Don't Miss!
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- News కడప కోర్టు ఆంక్షలపై హైకోర్టుకు సునీత..! వైసీపీపై కీలక వ్యాఖ్యలు..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడ్డినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
తెలుగు పరిశ్రమ దారుణంగా తయారైంది : కైకాల సత్యనారాయణ
సినీ పరిశ్రమ దారుణంగా తయారైందని కైకాల సత్యనారాయణ అన్నారు. చిత్రపరిశ్రమ గతంలో కళ కోసం పని చేసేదని ఆయన గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు చిత్రపరిశ్రమ వ్యక్తుల కోసం పని చేస్తోందని మండిపడ్డారు.
తెలుగు చిత్రపరిశ్రమపై దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమ దారుణంగా తయారైందని ఆయన అన్నారు. చిత్రపరిశ్రమ గతంలో కళ కోసం పని చేసేదని ఆయన గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు చిత్రపరిశ్రమ వ్యక్తుల కోసం పని చేస్తోందని మండిపడ్డారు.
తానెవర్నీ విమర్శించాలని భావించడం లేదని, అయితే చిత్రపరిశ్రమలో విధానం గురించి చెబుతున్నానని ఆయన చెప్పారు. తన సినీ కెరీర్ పై ఎలాంటి అసంతృప్తి లేదని ఆయన స్పష్టం చేశారు. గత సంవత్సరం కూడా ఒక సభలో ఏ సినిమా ఫంక్షన్లకు, కార్యక్రమాలకు సీనియర్లను పిలవడంలేదని... వాపోయారు కైకాల. ఏ వేడుక, ఎప్పుడు, ఎక్కడ జరిగిందో కూడా తెలియడం లేదన్నారు. ఆ కార్యక్రమాలను టీవీల్లో చూసినప్పుడు ఆయ్యో నన్ను పిలవలేదే... పిలిస్తే నేనూ వెళ్లి చూసేవేడిన కదా అనిపిస్తుందన్నారు
భగవంతుడి దయవల్ల అన్ని రకాల పాత్రల్లో తనను ప్రేక్షకులు ఆదరించారని ఆ యన తెలిపారు. విభిన్న రసాలను పండించడం వల్ల నవరసనటసార్వభౌమ బిరుదు ఇచ్చారని ఆయన అన్నారు. టీడీపీని స్ధాపించిన వారిలో తాను కూడా ఒకడినని ఆయన చెప్పారు.
అన్న ఎన్టీఆర్ తనను సొంత తమ్ముడికంటే ఎక్కువగా ఆదరించారని ఆయన తెలిపారు. అయితే టీడీపీ సొంత వారిని మర్చిపోయిందని ఆయన అన్నారు. అప్పుడు పీక్ లో ఉండే నటుడికి లక్షల్లో రెమ్యూనరేషన్ ఉండే దని, ఇప్పుడు కోట్లలో ఉందని ఆయన చెప్పారు.