Don't Miss!
- News అక్కడ వైసీపీని ఢీ కొట్టేదెవరు?
- Sports Navjot Singh Sidhu: సచిన్ కాదు.. టీమిండియా అత్యుత్తమ బ్యాటర్ అతనే!
- Lifestyle శ్రీ కృష్ణుడు గోపికలతో మొదలై హోలీ పండగ గురించి ఆసక్తికరమైన విషయాలు.!
- Automobiles ఆటోమేటిక్ గేర్ vs మాన్యువల్ ట్రాన్స్మిషన్.. వీటిలో ఏది బెస్ట్.?.. మనోళ్లు ఎక్కువగా వీటినే కొంటున్నారు.!!
- Technology సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హై రిస్క్ అలెర్ట్.. ఈ ఫోన్లలో భద్రతా లోపాలు.. అప్డేట్ చేయకుంటే..??
- Travel దేశంలో ఒక్కోచోట ఒక్కోలా రంగుల హోలీ జరుపుతారని మీకు తెలుసా?!
- Finance Market Crash: సెన్సెక్స్-నిఫ్టీ నేల చూపులు.. నిండా ముంచిన ఐటీ స్టాక్స్..
బాహుబలి ఎఫెక్ట్: మరో తెలుగు సినిమాను కొన్న కరణ్ జోహార్!
హైదరాబాద్: ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ బాహుబలి తర్వాత మరో తెలుగు సినిమాను కొనుగోలు చేసారు. రానా దగ్గుబాటి హీరోగా పివిపి బ్యానర్పై సంకల్ప్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఘాజి చిత్రాన్ని హిందీలో విడుదల చేయబోతున్నారు.
1971లో ఇండియా, పాకిస్థాన్ యుద్ధంలో ఇండియన్ నేవీలో కీలకపాత్ర పోషించిన ఈ యుద్ధనౌక సముద్రంలోనే మునిగిపోయింది. దాన్ని ఆధారంగా చేసుకుని భారీ బడ్జెట్తో రూపొందుతోన్న ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను థ్రిల్ చేసేలా రూపొందిస్తుండటంతో కరణ్ జోహార్ ఈ సినిమాను కొనడానికి ముందుకు వచ్చారు.
బాహుబలి కంటే ముందు రానా హిందీ ప్రేక్షకలు సుపరిచితం. హిందీలో రెండు మూడు చిత్రాల్లో నటించాడుకూడా. 'పింక్' చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకకున్న తాప్సీ, కె.కె.మీనన్ కీలకపాత్రలో నటిస్తుండటంతో కరణ్ జోహార్ ఈసినిమాను తీసుకోవడానికి ఆసక్తి చూపారు.
ఈ సినిమాలో నటిస్తుండటంపై తాప్సీ చాలా హ్యాపీగా ఉంది. సహజంగా కనిపించడానికి ప్రత్యేక ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నానని చెప్తోంది. ఇలాంటి సినిమాలు ఎప్పుడో కానీ రావని, అలాంటిది ఈ సినిమాలో నటించే అవకాశం రావడం తన అదృష్టం అని చెప్తోంది.