Don't Miss!
- Sports IPL 2024: చరిత్ర సృష్టించిన సన్రైజర్స్ హైదరాబాద్!
- News చంద్రబాబు బచ్చా కామెంట్ కు జగన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇలా...!
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
పోస్టర్ వివాదం: సమంత వ్యాఖ్యలపై క్రితి సానన్ స్పందన
హైదరాబాద్ : మహేష్ బాబు, క్రితి సానన్ జంటగా నటిస్తున్న '1-నేనొక్కడినే' సినిమాలోని ఓ సీన్ మహిళలను కించపరిచే విధంగా ఉందని...దుమూరం చెలరేగిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల విడుదలైన పోస్టర్లలో మహేష్ బాబు సముద్రం ఒడ్డున నడుస్తుంటే, ఆయన కాళ్ల వెనక హీరోయిన్ క్రితిసానన్ కుక్కలా పాకడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేసారు. సినిమా హీరోయిన్ సమంత, శేఖర్ కమ్ముల, సిద్ధార్థ తదితరులు సైతం ఈ పోస్టర్ పై విమర్శలు చేసారు.
ఈ అభ్యంతరాలపై తాజాగా హీరోయిన్ క్రితి సానన్ కూడా స్పందించింది. 'మహిళలను కించ పరిచే సన్నివేశాలు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఒప్పుకోను. ఇటీవల విడుదలైన పోస్టర్లో తప్పేమీ లేదు. అది సినిమాలోని పాటలో ఓ భాగం. సినిమా చూస్తే అందరికీ ఆ విషయం స్పష్టమవుతుంది' అన్నారు.
ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ బాబు మాట్లాడుతూ.....'ఆ పోస్టర్ వల్ల ఎవరి మనో భావాలైనా దెబ్బతింటే సారీ చెబుతున్నాను. వాస్తవానికి అందులో తప్పేమీ లేదు. సినిమాలో సాంగు పూర్తిగా చూస్తే ఆ సీన్లో తప్పులేదని అందరికీ అర్థమవుతుంది' అని మహేష్ బాబు వ్యాఖ్యానించారు.
సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ చిత్రాన్ని గ్రాండ్గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. '1-నేనొక్కడినే' చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రితి సానన్ హీరోయిన్. ఈ చిత్రం ద్వారా మహేష్ బాబు తనయుడు గౌతం బాలనటుడిగా తెరంగ్రేటం చేస్తున్నాడు. సాయాషి షిండే, కెల్లీ దోర్జి, విక్రం సింగ్, శ్రీనివాస రెడ్డి, నాజర్, ప్రదీప్ రావత్ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.