Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఎన్టీఆర్ బయోపిక్: బాలయ్య, జూ ఎన్టీఆర్పై లక్ష్మీ పార్వతి సంచలన కామెంట్స్!
నందమూరి బాలకృష్ణ తన తండ్రి, ప్రముఖ నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జీవిత చరిత్ర మీద సినిమా తీయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో స్వయంగా బాలయ్యే నటించబోతున్నారు
హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ తన తండ్రి, ప్రముఖ నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జీవిత చరిత్ర మీద సినిమా తీయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో స్వయంగా బాలయ్యే నటించబోతున్నారు.
అయితే ఈ సినిమా కేవలం ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా అయ్యే వరకు మాత్రమే ఉంటుందని, ఎన్టీఆర్ చివరి రోజుల్లో చోటు చేసుకున్న వివాదాస్పద, దారుణ సంఘటనలను ఇందులో చూపించే అవకాశం లేదని అంటున్నారు.
అవి చూపిస్తే ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి, బాలయ్యకు స్వయానా బావు, వీయంకుడు అయిన చంద్రబాబుకు అనవసర చిక్కులు వస్తాయనే ఉద్దేశ్యంతో ఎన్టీఆర్ పార్టీ స్థాపించి ముఖ్యమంత్రి పదవి చేపట్టే వరకు మాత్రమే ఈ సినిమా ఉంటుందని టాక్. ఈ సినిమాపై, బయట జరుగుతున్న ప్రచారంపై దివంగత ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.
అలా తీస్తే దాన్ని ఎన్టీఆర్ జీవిత చరిత్ర అని పేరు పెట్టడం ఎందుకు?
ఎన్టీఆర్ జీవితం మొత్తం చూపించనపుడు, ప్రజలకు చెప్పాల్సిన అసలు నిజాలను సినిమాలో చూపించనపుడు దానికి ఎన్టీఆర్ జీవిత చరిత్ర అని పెట్టడం అని లక్ష్మీ పార్వతి ప్రశ్నించారు. ఎన్టీఆర్ చివరి రోజుల్లో జరిగిన సంఘటనలను కూడా సినిమాలో చూపించాలని అన్నారు.
నేను విలన్ కాదు, నిజానికి దేవతను
సినిమాలో మిమ్మల్ని విలన్ గా చూపించే అవకాశం ఉందా? అనే పశ్నకు లక్ష్మీ పార్వతి స్పందిస్తూ.... నేను విలన్ ఎప్పటికీ కాదు, నిజానికి నేను ఎన్టీఆర్ జీవితంలో దేవతను అని లక్ష్మీ పార్వతి చెప్పుకొచ్చారు.
నన్న బూచిగా చూపారు
చంద్రబాబు, రామోజీరావు ఇద్దరూ కలిసి చేసిన కుట్రలో నన్ను బూచిగా చూపారు. జరిగినటువంటి చరిత్రను పక్కదారి పట్టించారు. మహానుభావుడిని అధ్యక్షపదవి నుండి తొలగించారు అని లక్ష్మి పార్వతి అన్నారు.
వక్రీకరించినట్లే
ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఎదుర్కొన్న సంఘటనలు, ఆయన పదవిని లాక్కున్న సంఘటనలు చూపించాలి. జరిగినవి జరిగినట్లుగా చూపించక పోతే.. బాలయ్య ఎన్టీఆర్ జీవిత చరిత్రను వక్రీకరించినట్లే అని లక్ష్మీ పార్వతి అభిప్రాయ పడ్డారు.
తండ్రిని చంపుకున్నారు
చంద్రబాబు చేసిన కుట్రలో నందమూరి వారసులు తండ్రిని పోగొట్టుకున్నారు. ఇపుడు పదవి కోసం రోడ్డు మీద తిరుగుతున్నారు. ఇంతకంటే దురదృష్టం ఇంకేముంటుంది? అని లక్ష్మి పార్వతి అన్నారు.
జూనియర్ ఎన్టీఆర్ చేసిన మేలు మచిచాడు, అహంకారే
జూఎన్టీఆర్, వాళ్ల అమ్మని కుటుంబం వెలేస్తే నేనే పిలిపించాను. అప్పటి నుండి ప్రతి రోజు స్కూలు నుండి రాగానే ఇంటికి పరుగెత్తుకుంటూ వచ్చేవాడు. కానీ చేసిన మేలు మరిచాడు. అందుకే అతన్ని అహంకారి అన్నాను... అని లక్ష్మీ పార్వతి తెలిపారు.
‘అర'జాన బాహుడు: జూనియర్పై లక్ష్మీ పార్వతి షాకింగ్ కామెంట్స్