twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరోనా క్రైసిస్ ఛారిటీ: ముందుకొచ్చిన లావణ్య త్రిపాఠి.. తన వంతుగా!

    |

    దేశంలో కరోనా వైరస్ కోరలు చాస్తోంది. ఈ మహామమారి దెబ్బకు యావత్ ప్రపంచం గడగడలాడిపోతోంది. కరోనా వైరస్ నివారణలో భాగంగా ఏ ఒక్క వ్యక్తీ ఇంటి గడపదాటి బయటకు రావొద్దని కేంద్ర, రాష్ట్ర ఆదేశాలు జారీ చేయడంతో ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయింది. ఈ ఎఫెక్ట్ సినీరంగంపై కూడా పడటంతో రోజూవారి సినీ కార్మికుల పరిస్థితి మరింత అద్వాన్నంగా తయారైంది.

    అయితే ఈ సంక్షోభ సమయంలో అందరికీ మేమున్నాం అంటూ స్వచ్చందంగా ముందుకొస్తున్నారు పలువురు సినీ ప్రముఖులు. ఇందులో భాగంగా సినిమా రంగాన్ని ఆదుకునేందుకు కంకణం కట్టుకున్నారు. ఈ మేరకు నిర్మాణాత్మక కార్యక్రమాల వైపు దృష్టి సారించిన ప్రముఖులు.. మెగాస్టార్ చిరంజీవి ఆధ్వ‌ర్యంలో 'సి.సి.సి. మ‌న‌కోసం' (క‌రోనా క్రైసిస్ చారిటీ మ‌న‌కోసం) అనే సంస్థ‌ను ఏర్పాటు చేశారు.

     Lavanya Tripathi Announced donation for Daily Wage Film Workers

    తమ సినిమాలకు సర్వం సమకూర్చే రోజూవారి సినీ కార్మికులను ఈ సంస్థ ద్వారా ఆదుకునేందుకు నడుం బిగించారు. పలువురు నటీనటులు ఈ క‌రోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) కి తమవంతు ఆర్థిక సాయం అందిస్తున్నారు. తాజాగా హీరోయిన్ లావణ్య త్రిపాఠి ముందుకొచ్చి లక్ష రూపాయల విరాళం ప్రకటించింది. కరోనా క్రైసిస్ ఛారిటీ‌కి విరాళం ఇచ్చిన తొలి మహిళా నటిగా గుర్తింపు పొందింది.

    ఈ సందర్భంగా లావణ్య మాట్లాడుతూ.. ''రోజూవారీ వేతనాలపై పనిచేసే సినీ కార్మికులకు సిసిసి ద్వారా నా వంతు సాయం అందిస్తున్నాను. ఇందులో భాగంగా రూ. 1 లక్ష రూపాయలు విరాళంగా ఇస్తున్నాను'' అని పేర్కొంది.

    English summary
    The 21 Days Lock down to control Corona Virus outbreak leads to stop all activity in the Film industry. Daily wage film workers are facing troubles due to lack of shootings. Lavanya Tripathi contributes Rs 1 Lakh to 'Corona Crisis Charity'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X