Don't Miss!
- Finance Jhunjhunwala News: కంపెనీలో 5 లక్షల షేర్లు కొన్న జున్జున్వాలా.. నష్టాల మార్కెట్లోనూ స్టాక్ ర్యాలీ..
- News ప్రచారం పక్కనపెట్టి గర్భిణీకి ప్రసవం.. దర్శి టీడీపీ అభ్యర్థికి హ్యాట్సాఫ్!!
- Lifestyle మామిడికాయ పచ్చడిని ఈజీగా ఇలా తయారు చేసుకోండి..
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Technology OnePlus Flip వన్ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
హాట్ టాపిక్: తేలని లారెన్స్ వివాదం...బ్యాన్??
హైదరాబాద్: దర్శకుడు లారెన్స్, రెబెల్ నిర్మాతల మధ్య వివాదం ఇంకా ముగియలేదు. నెల రోజుల లోపల రెండున్నర కోట్లు కాంపన్షేషన్ గా కడతానని చెప్పిన లారెన్స్ ఇప్పటివరకూ దాని విషయం తేల్చలేదు. ఈ విషయమై ఫిల్మ్ ఛాంబర్, డైరక్టర్స్ అశోశియేషన్ మార్చి 15న మీటింగ్ పెట్టుకుని ఏం చేయాలి,ఏం నిర్ణయం తీసుకోవాలి, లారెన్స్ పై ఏం చర్య తీసుకోవాలి అనే విషయమై చర్చించనున్నాయి. మరో ఛాన్స్ ఇచ్చి లారెన్స్ పై బ్యాన్ పెట్టే అవకాసం ఉందని తెలుస్తోంది.
ఆ సినిమాను రూ.22.5 కోట్లు వ్యయంతో రూపొందిస్తానని నిర్మాతలు భగవాన్, పుల్లారావులతో దర్శకుడు ఒప్పందం చేసుకొన్నారు. నిర్మాణ వ్యయం పెరిగింది. ఫలితంగా నిర్మాతలకు రూ.5 కోట్లకుపైగా నష్టం వాటిల్లిందనీ ఆ మొత్తాన్ని లారెన్స్ నుంచి ఇప్పించాలని నిర్మాతల మండలిని ఆశ్రయించారు. భగవాన్, పుల్లారావు. దీనిపై మండలి... దర్శకుల సంఘంతో కలిసి సమన్వయ కమిటినీ ఏర్పాటు చేసి చర్చలు సాగించింది. లారెన్స్ రెండున్నర కోట్ల రూపాయలు నిర్మాతలకు ఇవ్వాలని కమిటీ స్పష్టం చేసింది.
ప్రభాస్ హీరోగా నటించిన 'రెబల్' చిత్ర నిర్మాణ వ్యయం అదుపు తప్పడానికి కారణం దర్శకుడు లారెన్స్ అని ఆ చిత్ర నిర్మాతలు జె.భగవాన్, పుల్లారావులు తెలుగు నిర్మాతల మండలికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై అప్పట్లో నిర్మాతల మండలి కార్యదర్శి టి.ప్రసన్నకుమార్ ని మీడియా కలిసింది. ఆయన మాట్లాడుతూ ''మా ముందుకి నిర్మాతల ఫిర్యాదు వచ్చింది. ఖర్చు పెంచడం వల్లే నష్టం వాటిల్లిందని వారు స్పష్టం చేశారు. హిందీ హక్కుల్ని తన ప్రమేయం లేకుండా ఇచ్చేశారని దర్శకుడు అంటున్నారు. దీనిపైన నిర్మాతలూ వివరణ ఇచ్చారు. '' అన్నారు.
నిర్మాతలు జె.భగవాన్, పుల్లారావులు తెలుగు నిర్మాతల మండలికి చేసిన ఫిర్యాదులో రూ.22.5 కోట్ల వ్యయంతో రూపొందిస్తానని దర్శకుడు లారెన్స్ ఒప్పంద పత్రం రాశారనీ, అయితే చిత్ర నిర్మాణం పూర్తయ్యేసరికి రూ.40 కోట్లు ఖర్చయిందనీ వారు తెలిపారు. మరో వైపు లారెన్స్ 'రెబల్' నిర్మాతలపై దర్శకుల సంఘంలో ఫిర్యాదు చేశారు. తన ప్రమేయం లేకుండా ఆ చిత్రానికి సంబంధించిన రీమేక్, అనువాద హక్కుల్ని నిర్మాతలు అమ్మినట్లు తెలిపారు. ఈ వివాదానికి సంబంధించి రెండుమూడు రోజుల్లో సమన్వయ కమిటీ సమావేశం జరుగుతుందని తెలిసింది.