Don't Miss!
- Sports SRH vs RCB: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
చిరంజీవికి రూ. 500 కోట్లు, నాగార్జునకి రూ. 250 కోట్లు?
హైదరాబాద్: తెలుగులో అనతి కాలంలోనే పాపులర్ అయిన ‘మా టీవీ' దినదినాభివృద్ధి చెందుతూ తెలుగులో నెం.1 ఎంటర్టెన్మెంట్ నెట్వర్క్గా విస్తరించింది. మాటీవీ నెట్వర్కులో దాదాపు అరడజనుకుపైగా ఛానల్స్ ఉన్నాయి. తాజాగా మాటీవీని స్టార్ ఇండియా నెట్వర్క్ వారు సొంతం చేసుకున్నారు.
ఆ మధ్య హైదరాబాద్ లో జరిగిన డీల్ లో స్టార్ గ్రూప్ యాజమాన్యం మా టీవీలోని వాటాను కొనుగోలు చేసింది. అనధికారిక సమాచారం ప్రకారం ఈ డీల్ విలువ విలువ రూ. 2500 కోట్లు ఉంటుందని అంచనా. మా టెలివిజన్ నెట్వర్క్లో నిమ్మగడ్డ ప్రసాద్కు 65 శాతం వాటా ఉండగా చిరంజీవి కుటుంబానికి 20 శాతం, అక్కినేని నాగార్జునకు 10 శాతం, రిటైల్ ఇన్వెస్టర్ల చేతుల్లో 5 శాతం వాటాలు ఉన్నాయి.
ఈ లెక్క ప్రకారం 20శాతం వాటా ఉన్న చిరంజీవి ఫ్యామిలీకి రూ. 500 కోట్లు, 10 శాతం వాటా ఉన్న నాగార్జునకు రూ. 250 కోట్లు దక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది. రిటైల్ ఇన్వెస్టర్ల చేతుల్లో 5 శాతం వాటాలు ఉన్నాయి.వారికి 125 కోట్లు చెందనున్నట్లు తెలుస్తోంది. వాటాలకు సంబంధించిన మొత్తం త్వరలోనే చిరంజీవి, నాగార్జునలకు చెందుతాయని సమాచారం.
అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ దేశీయ మీడియా రంగంలో ఇది అతిపెద్ద డీల్గా చెప్పవచ్చు. సీరియల్ ఎంటర్ప్రీన్యూర్గా పేరున్న నిమ్మగడ్డ ప్రసాద్, బహుశ ఈ వాల్యుయేషన్ కారణంగానే చానెల్స్ విక్రయానికి సిద్ధపడి ఉంటారని అంటున్నారు. మీడియా మొగల్గా పేరున్న రూపర్డ్ మర్డోక్ ప్రమోట్ చేసిన స్టార్ టీవీ దేశీయ మార్కెట్లో దూకుడుగా విస్తరిస్తోంది. ప్రాంతీయ భాషా చానళ్ల కొనుగోలుతో నెట్వర్క్ను విస్తృతం చేసుకుంటున్నది.