Don't Miss!
- News 'ఓటుకు నోటు' కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
- Finance IT News: టెక్ కంపెనీల్లో అత్యధిక జీతం ఆయనకే.. దేశీయ ఐటీ కంపెనీల్లో రికార్డు..
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. లాంచ్, స్పెసిఫికేషన్ల పూర్తి వివరాలు..!!
- Sports ధోనీని ఒప్పించడం కష్టమే..ఆ ఫేక్ న్యూస్ నమ్మొద్దు- రోహిత్
- Lifestyle Marriage Day Wishes in Telugu : పెళ్లిరోజు శుభాకాంక్షల సందేశాలను ఇలా పంపండి..
- Automobiles జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మహేష్ బాలీవుడ్ ఎంట్రీ ఖరారు..డిటేల్స్
మహేష్ బాబు బాలీవుడ్ ఎంట్రీ గురించి చాలా కాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రం ఫైనలైజ్ అయినట్లు ముంబై మిర్రర్ పత్రికలో కథనం ద్వారా తెలుస్తోంది. ప్రిన్స్ (వివేక్ ఒబరాయ్) చిత్రంతో పరచయమైన కుకి గులాటి అనే దర్శకుడు ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నాడు. కుకి ప్రస్తుతం శ్రీమతి షిండేతో కలసి తిచా బాప్...త్యాచా బాప్ అనే చిత్రం రూపొందిస్తున్నాడు. ఆ చిత్రం అనంతరం చేయబోయే చిత్రం మహేష్ బాబుది అని రాసుకొచ్చింది ఆ పత్రిక. అలాగే సోబో ఫిల్మ్స్ వారు ఆ చిత్రాన్ని నిర్మించనున్నారని తెలిపింది. ఇక కుకి,మహేష్ బాబు ఓ యాడ్ ఫిలిం షూటింగ్ లో కొద్ది నెలల క్రితమే పరిచయమయ్యారు. అప్పుడు కుకి చెప్పిన ఓ ధ్రిల్లర్ లైన్ విపరీతంగా మహేష్ కు నచ్చటంతో స్క్రిప్టు చేసుకుని కలవమని చెప్పాడని సమాచారం.
మొన్న దూకుడు షూటింగ్ సమయంలోనూ ముంబైలో కుకి వచ్చి మహేష్ తో చర్చించి వెళ్లాడని సమాచారం. ఇక ఈ విషయమై కుకి గులాటిని మీడియావారు అడగగా...ఇప్పటివరకూ ఏది ఫైనల్ కాలేదు...ఇంకా ఆ ప్రాజెక్టు ప్రారంభ స్టేజిలో ఉంది.ఇప్పుడు నేను మాట్లాడితే బాగోదు. నేను చేస్తున్న మరాఠి చిత్రం పూర్తయ్యేదాకా మరో సినిమాగురించి మాట్లాడలేను అన్నారు. ఇక మహేష్ చేసిన దూకుడు చిత్రం హిందీలో సల్మాన్ ఖాన్ చేయబోతున్నారు. ఆ చిత్రం కలెక్షన్స్ పరంగా కొత్త రికార్డులు క్రియోట్ చేస్తోన్న సంగతి తెలిసిందే.