Don't Miss!
- News దానం నాగేందర్ కు షాక్ - కాంగ్రెస్ అభ్యర్ది మార్పు..!?
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మహేష్ బాబు- గౌతమ్ మీనన్ కాంబినేషన్ ఓకే అయింది!
హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, గౌతమ్ మీనన్ కాంబినేషన్లో సినిమా రాబోతోందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఎట్టకేలకు వీరి కాంబినేషన్లో సినిమా ఓకే అయింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ నిర్మించోతున్నారు. ఈ విషయాన్ని అశ్వినీదత్ స్వయంగా ప్రకటించారు.
అశ్వనీదత్ మాట్లాడుతూ 'మహేష్ బాబు, గౌతమ్ మీనన్ ల కాంబినేషన్ లో వైజయంతి మూవీస్ బ్యానర్ లో నెక్స్ట్ మూవీ ఉంటుంది. ఈ సినిమాని త్వరలోనే అధికారికంగా లాంచ్ చేయనున్నారు. అలాగే సినిమాని 2017 సమ్మర్ కానుకగా మే లో రిలీజ్ చేస్తాం' అని చెప్పారు.
ఐదేళ్ల క్రితం ఎన్టీఆర్ తో 'శక్తి'సినిమా తీసి భారీగా నష్టపోయిన అశ్వినీదత్ సినిమా నిర్మాణానికే దూరం అయ్యారు. లాంగ్ గ్యాప్ తర్వాత ఆయన మహేష్ బాబుతో సినిమా చేస్తుండటం విశేషం.
ప్రస్తుతం మహేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'బ్రహ్మోత్సవం' సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే ఏప్రిల్ లో మురుగదాస్ దర్శకత్వంలో తెలుగు-తమిళంలో తెరకెక్కే ద్విబాషా చిత్రంలో మహేష్ బాబు నటించబోతున్నారు. ఈ చిత్రం పూర్తయిన తర్వాత గౌతమ్ మీనన్ తో మహేష్ బాబు సినిమా చేస్తారు.