Just In
- 22 min ago
నా పేరు రంగడు వీడి పేరు.. హద్దులు దాటుతోన్న హైపర్ ఆది డబుల్ మీనింగ్
- 1 hr ago
అది కంట్రోల్ చేయడమే నా పేరుకు అర్థం.. ఎద అందాలతో చిచ్చుపెట్టిన ఊర్వశీ
- 2 hrs ago
ఇదెక్కడి వింతరా బాబు.. సుత్తితో కొట్టేసుకుంటోన్న హీరో.. వీడియో వైరల్
- 2 hrs ago
నాగ చైతన్య, సాయి పల్లవి లవ్ స్టోరీ: ముహూర్తం ఫిక్స్ చేసిన చిత్ర యూనిట్
Don't Miss!
- Finance
ఆనంద్ మహీంద్ర గిప్ట్: ఆరుగురు టీమిండియా ప్లేయర్లకు కార్లు బహుమానం..
- News
ఎవరి ప్రాపకం కోసం ఎన్నికలు .. ఎస్ఈసీ నిమ్మగడ్డపై విరుచుకుపడిన స్పీకర్ తమ్మినేని సీతారాం
- Sports
ఏదైనా చేసుకోండి.. మేం మాత్రం అక్కడికి వెళ్లం! బీసీసీఐకి రవిశాస్త్రి హెచ్చరిక!
- Automobiles
డిసెంబర్లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..
- Lifestyle
సెక్స్ సమయంలో మీరు ఈ పని చేస్తే ఏమి జరుగుతుంది?
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మరో చిన్నారికి హార్ట్ సర్జరీ.. మానవత్వం ప్రదర్శించిన మహేష్.. నమ్రతా ఎమోషనల్ కామెంట్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు కేవలం సినిమాల్లోనే కాకుండా వెండితెర వెనుక కూడా సూపర్ హీరోగా మంచి గుర్తింపును అందుకుంటున్నాడు. ప్రాణాపాయ స్థితిలో ఉండే చిన్నారులకు అండగా నిలుస్తూ వారు కొలుకోవడానికి ఎంతగానో సహాయం చేస్తున్నాడు. హార్ట్ సర్జరీలు చేయించడంలో ఇప్పటికే రికార్డు క్రియేట్ చేసిన సూపర్ స్టార్ ఇటీవల మరొక చిన్నారికి కొత్త జీవితాన్ని ఇచ్చాడు. ఆ సహాయలన్నింటిని భార్య నమ్రత దగ్గరుండి చూసుకుంటోంది.
ఇక రీసెంట్ గా ఆంధ్ర ఆసుపత్రులలో మరో అద్భుతమైన రికవరీ అంటూ గుడ్ న్యూస్ చెప్పారు. తీవ్రమైన పల్మ్ వాల్వ్ స్టెనోసిస్తో అలాగే కాల్సిఫైడ్ పల్మనరీ వాల్వ్తో పోరాడుతున్న డింపుల్ అనే పాపకు ట్రెట్మెంట్ ఇప్పించాడు మహేష్. ఆమె మునుపటి కంటే మెరుగ్గా ఉందని తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని పిల్లలకి, కుటుంబానికి చాలా ఆశీర్వాదాలు అంటూ నమ్రతా వివరణ ఇచ్చింది. నమ్రత సోషల్ మీడియాలో కేవలం తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలనే కాకుండా నలుగురికి సహాయం చేసిన సంతోషలను కూడా షేర్ చేసుకుంటున్నారు.

ఇక అభిమానులు కూడా మహేష్ బాబు చేస్తున్న పనులను మరింతగా ఆకర్షితులవుతున్నారు. అందుకే మహేష్ అన్నకు ఇంతమంది అభిమానులు ఉన్నారని పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మహేష్ బాబు నెక్స్ట్ సర్కారు వారి పాట అనే సినిమా చేయనున్న విషయం తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆ సినిమా షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఆ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.