Don't Miss!
- News ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మహేష్బాబు విజన్ ఆఫ్ భరత్.. జనం కోసం, జనం కొరకు.. ఫ్యాన్స్కు థ్రిల్లింగ్
Recommended Video
ప్రిన్స్ మహేష్బాబు నటిస్తున్న భరత్ అనే నేను చిత్రానికి సంబంధించిన విజన్ ఆఫ్ భరత్ ప్రత్యేక టీజర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అభిమానులను థ్రిల్ గురిచేసేలా ప్రిన్స్ విజన్ ఆఫ్ భరత్ను రూపొందించారు. రిలీజైన వెంటనే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రాజకీయ నేపథ్యంగా రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్బాబు ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే.
విద్యావ్యవస్థలోని లోపాలపై
విజన్ ఆఫ్ భరత్ రిలీజ్ నేపథ్యంలో విద్యా వ్యవస్థలోని లోపాలు, విధానాలపై మహేష్బాబు సెటైర్ వేశారు. దేశం వెనుకబడి ఉండటానికి కారణాలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థలోని లోపాల గురించి ఆయన చర్చించే ప్రయత్నం చేశారు.
అభివృద్ధి చెందుతున్న దేశంగా
భారత దేశం ఇంకా ఎందుకు అభివృద్ది చెందుతున్న దేశంగానే ఉంది. ఇలాంటి పరిస్థితి ఉండటానికి ఎలాంటి అంశాలు అవరోధంగా మారాయి. భారతీయ విద్యా వ్యవస్థ గురించి ఏదైన చదివినప్పుడల్లా ఇలాంటి ప్రశ్నలు నాలో లేస్తుంటాయి.
దేశానికి విద్య ఆయువుపట్టు
దేశం అభివృద్ధి పథంలోకి ప్రయాణించాలంటే విద్యా వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. దేశ పురోగాభివృద్ధికి విద్యా వ్యవస్థనే ఆయువుపట్టు అని ప్రిన్స్ మహేష్ సోషల్ మీడియాలో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు.
కొరటాల శివతో రెండో సినిమా
శ్రీమంతుడు తర్వాత మహేష్బాబు, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో ప్రిన్స్కు జంటగా కైరా అద్వానీ నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 20న ప్రేక్షకుల ముందుకు వస్తున్నది.