Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మహేష్బాబు నా పేరు చెప్పారనే చేసాను
హైదరాబాద్ : ''మహేష్ నటనంటే నాకు ఇష్టం.'శ్రీమంతుడు' స్క్రిప్టు పనులు జరుగుతున్నప్పుడు ఓ పాత్రకు యంగ్ హీరోని తీసుకొంటే బాగుంటుంది అనుకొన్నారట. అప్పుడు 'అందాల రాక్షసి'లో చేసిన అబ్బాయిని తీసుకొందాం' అని నా పేరు చెప్పారట. ఆ మాట వినగానే ఇంకేం ఆలోచించలేదు. మహేష్ సెట్లో ఎలా ఉంటాడో చూడ్డానికైనా ఈ సినిమా చేయాల్సిందే అనుకొన్నా'' అన్నారు రాహుల్ రవీంద్రన్.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
'అందాల రాక్షసి' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని పలరించాడు రాహుల్ రవీంద్రన్. 'అలా ఎలా'తో ఓ మంచి విజయాన్ని అందుకొన్నాడు. ఇప్పుడు 'టైగర్' ఈనెల 26న విడుదలకు సిద్ధమైంది. 'శ్రీమంతుడు'లోనూ అతిథి పాత్ర పోషించాడు. రాహుల్ హైదరాబాద్లో మీడియాతో ముచ్చటించాడు.
'టైగర్' గురించి మాట్లాడుతూ... ''స్నేహం, ప్రేమ నేపథ్యంలో సాగే పక్కా వాణిజ్య చిత్రం 'టైగర్'. ఇద్దరబ్బాయిలు, ఓ అమ్మాయి అనేగానే ముక్కోణపు ప్రేమకథ అనుకొంటారు. అయితే మా మూడు పాత్రల మధ్య ఉన్న సంబంధం ఏమిటన్నది చాలా కీలకం అన్నారు.
అలాగే సందీప్కిషన్లాంటి స్నేహితుడితో కలసి నటించడం ఓ మంచి అనుభూతి. 'టైగర్'ని తనే నా దగ్గరకు తీసుకొచ్చాడు. సినిమా బాగా వచ్చింది. 'అలా ఎలా' తరవాత చేస్తున్న సినిమా ఇది. కాబట్టి మరో విజయం సాధించాలన్న తపనతో చేశాము''అన్నారు.