Don't Miss!
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- News పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపు కష్టమే ... ప్రముఖ నిర్మాత షాకింగ్ కామెంట్స్
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Sports IPL 2024: హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే ముంబై ఇండియన్స్ కొంపముంచింది: క్రీడా మంత్రి
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అక్టోబర్ 6 నుండి ఇద్దరు స్టార్ హీరోల మల్టీస్టారర్...సంచలనం..!
దూకుడు షూటింగ్ తో బిజీగా ఉన్న మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేస్తున్నాడనే సంగతి తెలిసిందే. బిజినేస్ మ్యాన్ టైటిల్ తో రూపొందే ఈ చిత్రం తర్వాత మహేష్ ఓ ద్విభాషా చిత్రంలో మణిరత్నం దర్శకత్వంలో నటించాల్సి ఉంది. అయితే ఈ సినిమా కథా చర్చల వద్దే ఆగిపోవడంతో మహేష్ తన డేట్స్ దిల్ రాజుకిచ్చాడు.
'కొత్త బంగారు లోకం" దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించే మల్టీస్టారర్ లో నటించడానికి మహేష్ అంగీకరించాడు. మహేష్ తో పాటు ఇందులో వెంకటేష్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తాడు. మొదట లైన్ విని పూర్తి కథతో రమ్మన్న మహేష్ కథంతా విన్నాక ఓకే చెప్పాడని, ఈ చిత్రం అక్టోబర్ కల్లా సెట్స్ మీదకు వెళుతుందని సమాచారం.
మల్టీస్టారర్స్ ఏనాడో అంతరించిపోయిన తెలుగు చిత్ర పరిశ్రమలో మళ్లీ వాటికి ఊపిరిపోసే చిత్రమిది అవుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మహేష్. వెంకటేష్ ల కలయికలో రూపొందే ఈ చిత్రానికి ఇంకా టైటిల్ నిర్ణయించలేదు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయని సమాచారం..