చిన్న పిల్లలకోసం మహేష్ చారిటీ
ఇంతకుముందే ప్రకటించినట్టుగా మహేష్ బాబు చారిటీ వర్క్ మొదలుపెట్టాడు. బలవర్ధక ఆహారం దొరకక రోగాలతో ఇబ్బందులు పడుతున్న బాలలను ఆదుకోవడం కోసం ఇప్పటికే రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ వర్గాలతో సంప్రదింపులు జరిపాడు. మహేష్ బాబు కుమారుడు గౌతమ్ బరువు తక్కువగా పుట్టడంతో రెయిన్ బో ఆసుపత్రి చక్కని ట్రీట్ మెంట్ ను అందించింది. డబ్బులు ఉన్న తనకే ఇంత ఇబ్బంది అయితే డబ్బులు లేని వారి పరిస్థితి ఎలా అనే ఆలోచనతోనే ఈ చారిటీకి సిద్ధమైనట్టు మహేష్ తెలిపారు. ఇలా ఇబ్బందులు ఎదుర్కొనే పేద తల్లితండ్రులను ఆదుకోవడం కోసమే ఈ చారిటీని ప్రారంభించనున్నాడు. ఇందుకోసం మహేష్ బాబు కొంత ఫండ్ ను ఇందుకోసం కేటాయించనున్నాడు.


Click it and Unblock the Notifications











