Just In
Don't Miss!
- News
విమానంలో టాయిలెట్కు వెళ్లనివ్వలేదని... డీజీసీఏ ఉద్యోగులను కిడ్నాప్ చేసిన యువకుడు...
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Lifestyle
సినిమా థియేటర్ కు వెళ్దామనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే...
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
చిన్న గొడవ జరిగింది: చక్రి తమ్ముడు నారాయణ
హైదరాబాద్: చక్రి మరణం తెలుగు సంగీత ప్రపంచాన్ని, అభిమానులను విషాదంలో ముంచెత్తింది. అయితే ఆయన మరణం తర్వాత జరిగిన పరిణామాలు అందరినీ విస్మయానికి గురి చేస్తున్నాయి. అత్తింటి వేధింపులు అంటూ చక్రి భార్య శ్రావణి హెచ్చార్సీని ఆశ్రయించడమే ఇందుకు కారణం.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
దీంతో చక్రి కుటుంబంలో అతర్గతంగా ఉన్న గొడవ విషయం బయటకు వచ్చింది. చిన్న గొడవ కారణంగా చక్రి తల్లితో పాటు తమ్ముడు మహిత్ నారాయణ గత కొన్ని రోజులుగా విడిగా ఉంటున్నారని తెలుస్తోంది. వదిన శ్రావణి హెచ్చార్సీని ఆశ్రయించిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

అన్నయ్య చక్రీకి కుటుంబం అంటే చాలా ఇష్టమని, అది మాటలలో చెప్పలేమని, అది చూసినవాళ్లకు మాత్రమే తెలుస్తుందని ఆయన సోదరుడు మహిత్ నారాయణ తెలిపారు. ఇంట్లో చిన్న గొడవ అయిందని నేను అమ్మ ఇంట్లో నుంచి బయటకు వచ్చేశామని, 22 రోజులు నుంచి వేరుగా ఉంటున్నామని చెప్పారు. అన్నయ్య, వదిన కోసమే ఇంట్లో నుంచి వెళ్లిపోయాయని మహిత్ నారాయణ తెలిపారు.
ప్రతి కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు సహజమని, మా మధ్య ఎలాంటి విభేధాలు లేవని, మా వదినను ఎవరూ వేధించలేదని నారాయణ స్పష్టం చేశారు. నన్ను దూషించానా వదినపై ఎలాంటి కోపం లేదని ఆయన అన్నారు. మరి అమె ఎందుకు హెచ్చార్సీలో పిర్యాదు చేశారో తెలియదన్నారు. అప్పుడు ఆవేశంలో గొడవ పడ్డాం. ఇపుడు మా మధ్య విబేధాలు ఏమీ లేవు. కుటుంబసభ్యులందరం కూర్చొని సమస్యలపై చర్చించుకుంటామన్నారు.