Don't Miss!
- Lifestyle హడలెత్తిస్తున్నBird Flu పాలు, గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- News గెలిస్తే వాషింగ్టన్ డీసీ చేస్తా అన్నావ్.. రాజధానే లేకుండా చేశావ్ జగనన్నా.. షర్మిల చురకలు
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Finance Nestle India: అదిరిపోయే లాభాలు ప్రకటించిన నెస్లే ఇండియా..
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
స్వామివారి మొక్కు తీర్చుకున్న మంచు మనోజ్
తిరుమల: ఇటీవల రోడ్డు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన హీరో మంచు మనోజ్ శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీవారి దయతోనే ప్రమాదం నుంచి బయటపడ్డానని చెప్పారు.
త్వరలో ప్రేక్షకుల ముందుకు పాండవులు...పాండవులు తుమ్మెద సినిమా వస్తుందని ఆయన చెప్పారు. విఐపి ప్రారంభ దర్శన సమయంలో ఆయన శ్రీవెంకటేశ్వర స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఇటీవల హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన కారు ప్రమాదంలో గాయపడి తాను త్వరగా కోలుకోవడంతో మొక్కు తీర్చుకోవడానికి వచ్చినట్లు ఆయన తెలిపారు.
హైదరాబాద్ ఔటర్రింగ్రోడ్డుపై అప్పా వద్ద ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న సినీ నటుడు మోహన్బాబు కుమారుడు మనోజ్కు ఇటీవల స్వల్ప గాయాలయ్యాయి. అతన్ని వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించారు.
జూబ్లీహిల్స్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వెళ్తుండగా గేదె అడ్డుతగిలి కారు బోల్తా పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారులో ఉన్న బెలూన్స్ తెరుచుకోవడంతో అందులోని మనోజ్తో పాటు డ్రైవర్, బాడీగార్డు త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి.