Don't Miss!
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports అతని వల్లే RCB టైటిల్ చేజారింది- అనిల్ కుంబ్లే
- News విడుదల రజిని కిడ్నాప్...నామినేషన్ వేయకుండా
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రామ్ చరణ్ చేయకపోతే నేను చేస్తా: మంచు విష్ణు వర్ధన్
'దూసుకెళ్తా' గురించి చెప్తూ... ఏ పని చేయడానికైనా అతడు ముందుంటాడు. అయితే షరతులు వస్తాయి. ఇదేంటి ప్రకటనల్లోలాగా షరతులు అనుకుంటున్నారా? 'దేనికైనారెడీ' అనే తత్త్వం ఉన్న కుర్రాడు కదా. అందుకే 'దూసుకెళ్తా' అంటే షరతులు విధించారు. అయితే అవి మంచి కోసమే. అతడు పండించే వినోదానికి మాత్రం ఎలాంటి షరతులు ఉండవు. ఇలాంటి కుర్రాడు పరిశోధనాత్మక పాత్రికేయుడిగా సమాజం కోసం పని చేస్తున్నాడు. ఎలాంటి వారికి అలాగే బుద్ధి చెప్పే ఆ కుర్రాడి కథే మా సినిమా అన్నారు మంచు విష్ణు. ఈ 'దూసుకెళ్తా' చిత్రం నా పదేళ్ల సినీ జీవితాన్ని మరో పదేళ్లపాటు వేగంగా దూసుకెళ్లేలా చేస్తుందంటున్నారు.
ఇక ''ఈ సినిమా కథని పూర్తిగా వినకుండానే నేను చేయడానికి అంగీకరించాను. దర్శకుడు వీరు పోట్ల మొదట తమ్ముడు మనోజ్కి కథ చెప్పాడు. ఆ తర్వాత నాన్న కూడా విన్నారు. వారిద్దరికి నచ్చి చేయమంటేనే నేను చేశాను. సినిమా చేస్తున్నన్ని రోజులు ఏదో ఓ భయం ఉండేది. సినిమా పూర్తయ్యాక నాన్నగారు, నన్ను అభిమానించే వారందరికీ చూపించాను. వాళ్ల స్పందన చూసిన తర్వాతే నాకు నిద్ర పట్టింది. ఈ సినిమాలో నన్ను, బ్రహ్మానందంగారిని చూసినవాళ్లు... నాన్నగారు, బ్రహ్మానందంగారి కాంబినేషన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. దీంతోపాటు వెన్నెల కిషోర్ కూడా ప్రేక్షకుల్ని అలరిస్తాడు. అక్క లక్ష్మీ ప్రసన్న ప్రత్యేక పాత్రలో మురిపిస్తుంది. రవితేజ నేపథ్యగళం సినిమాకి అదనపు ఆకర్షణ'' అన్నారు.
వీరు పోట్ల మాట్లాడుతూ ''రవితేజ గళంతో సాగే సన్నివేశాలు ప్రేక్షకులకి గిలిగింతలు పెట్టేలా ఉంటాయి. సినిమా ప్రారంభంలోనే ఆయన గొంతు వినిపిస్తుంది. ఇందులో విష్ణు పాత్రికేయుడిగా కనిపిస్తారు''అని తెలిపారు. ఇక ఈ చిత్రంలో రవితేజ గళం వినిపిస్తుంది. ఇందులో హీరో పాత్ర చిన్న పిల్లవాడి నుంచి పెద్దవాడిగా ఎదిగే నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. అవి ఆద్యంతం సరదాగా సాగుతాయి. ఆ సన్నివేశాలకి రవితేజ గళాన్ని అందించారు.
వినోదాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, ఆహుతి ప్రసాద్, కోట శ్రీనివాసరావు, రావు రమేష్, పంకజ్ త్రిపాఠి, పోసాని, రఘుబాబు, భరత్, అన్నపూర్ణమ్మ, రజిత, సురేఖావాణి, హేమ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:సర్వేష్ మురరి, ఎడిటింగ్:మార్తాండ్ కె.వెంకటేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:ఆర్.విజయకుమార్.