Don't Miss!
- News బీజేపీ 7వ జాబితా: అమరావతి నుంచి నవనీత్ కౌర్ రాణా పోటీ
- Sports Hardik Pandya: అస్సలు ఊహించలేదు.. ఆ తప్పిదమే మా కొంపముంచింది!
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ తప్పులను నిర్లక్ష్యం చేసిన వారు జీవితంలో ఘోర వైఫల్యాన్ని ఎదుర్కొంటారు...!
- Automobiles కొత్త కాంపాక్ట్ ఎస్యూవీ బసాల్ట్ విజన్ ఎస్యూవీని ఆవిష్కరించిన సిట్రోయెన్
- Technology WhatsApp ద్వారా విదేశాలకు డబ్బు పంపేందుకు కొత్త ఫీచర్! వివరాలు
- Travel శివ కళ్యాణోత్సవాలకు ముస్తాబైన వేములవాడ రాజన్న ఆలయం!
- Finance Hyderabad: తల్లి కోరిక తీర్చిన ఆనంద్ మహీంద్రా.. 4000 మంది విద్యార్థుల కోసం హైదరాబాదులో..
చిరుకి గానీ ఆయన ఫ్యామిలీకి గానీ వాటితో ఎలాంటి సంబంధం లేదు.. క్లారిటీ ఇస్తూ ప్రెస్ నోట్
ఇన్నాళ్లు బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ లాంటి పలు సామాజిక సేవా సంస్థలు నడిపిస్తూ వస్తున్న మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే విద్యా వ్యవస్థ లోకి అడుగు పెడుతున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఓ పాఠశాలను ఆయన ప్రారంభించబోతున్నట్లు వార్తలు రాసుకొచ్చారు. అయితే దీనిపై క్లారిటీ ఇస్తూ తాజాగా ప్రెస్ నోట్ విడుదల చేశారు మెగా అభిమానులు.
|
చిరంజీవి ఫ్యామిలీకి సంబంధం లేదు
చిరంజీవికి గానీ, రామ్ చరణ్ కి గానీ, నాగబాబుకి గానీ ఈ విద్యాసంస్థలతో ఎటువంటి సంబంధం లేదని ఈ ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు. చిరంజీవి అభిమానులమైన తాము సేవా దృక్పధంతో, సామాజిక స్పృహతో చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్స్ పేరిట విద్యాసంస్థను స్థాపిస్తున్నామని తెలిపారు.
దిగువ తరగతి ప్రజలకు మేలు కలగాలని
కార్పొరేట్ కల్చర్ బాగా విస్తరిస్తున్న ఈ రోజుల్లో దిగువ, మధ్య తరగతి ప్రజలకు కార్పొరేట్ విద్య అనేది అందని ద్రాక్ష అయింది. బోలెడు ఫీజులు చెల్లించి కార్పొరేట్ విద్య అందించలేక ఎంతో మంది తల్లిదండ్రులు నిరాశ చెందుతున్నారు. ఈ వెలితిని తీర్చేందుకే మా చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్ స్థాపించబోతున్నామని వారు అన్నారు.
తక్కువ ఫీజులు.. మెగా కుటుంబంపై అభిమానంతో
తమకు మెగా కుటుంబంపై ఉన్న అభిమానంతోనే ఈ విద్యాసంస్థను ప్రారంభిస్తున్నామని, దీనికి చిరంజీవి గారిని, రామ్ చరణ్ గారిని, నాగబాబు గారిని గౌరవ ఫౌండర్లుగా, గౌరవ అధ్యక్షులుగా మియమించుకున్నామని పేర్కొంటూ.. ఈ విద్యాసంస్థ ద్వారా దిగువ, మధ్య తరగతి విద్యార్థులకు తక్కువ ఫీజులకే విద్యనందిస్తామని తెలిపారు. తమ యొక్క ఈ చిరు ప్రయత్నానికి మీ అందరి సహకారం కావాలని ఈ సందర్బంగా వారు అభ్యర్థించారు.
మెగాస్టార్ చిరంజీవి
చిత్రసీమలోకి గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహా రెడ్డి సినిమాలో నటిస్తున్నారు. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నయనతార, తమన్నా, అమితాబ్ బచ్చన్, సుదీప్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిత్రాన్ని అక్టోబర్ 2 తేదీన విడుదల చేయనున్నారని తెలుస్తోంది.