Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మెగా అభిమాని మృతి.. కదిలి వచ్చిన చిరంజీవి, అల్లు అర్జున్.. రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్
మెగాభిమానులు అనేది ఓ కుటుంబంలాంటింది. మెగా ఫ్యామిలీ నుంచి ఎంత మంది హీరోలు వచ్చినా ప్రేమిస్తూ ఆదరిస్తూనే ఉంటారు మెగాభిమానులు. ఒకరా ఇద్దరా అని లెక్కపెట్టడానికి వీల్లేనటువంటి సమూహంలా ఉంటుంది ఆ గణం. అందులోంచి ఓ వీరాభిమాని నేడు మరణించాడు. అతనెవరో కాదు.. మెగాస్టార్ చిరంజీవి నుంచి మొదలుకొన్ని సాయి ధరమ్ తేజ్ వరకు గొప్ప అభిమానిగా పేరు తెచ్చుకున్నాడు నూర్ భాయ్.
గ్రేటర్ హైదరాబాద్ మెగా ఫ్యాన్స్ ప్రెసిడెంట్..
గ్రేటర్ హైదరాబాద్ మెగా ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గా ఉన్న ఆయన అనారోగ్యంతో ఈరోజు కన్నుమూశాడు. ఈ సంగతి తెలిసిన మెగా అభిమానులు తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారు. సోషల్ మీడియా మొత్తం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
అభిమానులే కుటుంబం..
‘ఫ్యాన్సే ఫ్యామిలీ. నూర్ మహ్మద్ గారిని మేమంతా మిస్ అవుతాము. అతని పాజిటివ్ అండ్ హెల్పింగ్ నేచర్ ఎంతో మంది స్ఫూర్తిధాయకం. ఆయన ఆత్మకు శాంతి కలగాలి'అంటూ రామ్ చరణ్ స్పందించాడు.
మెగాఫ్యామిలీ అతడ్ని కోల్పోయింది..
‘మెగాఫ్యాన్స్ అనే ఫ్యామిలీ.. స్ట్రాంగెస్ట్ పిల్లర్ను కోల్పోయింది. నూర్ భాయ్ ఫ్యామిలీకి ప్రగాఢ సానుభూతి, అతని కుటుంబానికి బలం చేకూరాలి, నా మద్దతు వారికి ఉంటుంది' అంటూ సాయి ధరమ్ తేజ్ పోస్ట్ చేశాడు.
|
కుటుంబాన్ని ఓదార్చిన అల్లు అర్జున్..
నూర్ మరణ వార్తను తెలుసుకున్న అల్లు అర్జున్ సైతం ఆయన ఇంటికి వెళ్లి కుటుంబాన్ని ఓదార్చాడు. కుటుంబాన్ని ఆర్థిక సహాయాన్ని అందిస్తానని హామి ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Recommended Video
కుటుంబాన్ని పరామర్శించిన చిరంజీవి..
ఎన్నో యేళ్ల నుంచి మెగా ఫ్యామిలీకి అభిమానిగా, ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకున్న నూర్ మహ్మద్ నేడు మరణించాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న చిరంజీవి.. అభిమాని ఇంటికి చేరుకుని కుటుంబాన్ని పరామర్శించాడు.