Don't Miss!
- Sports 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్: మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అలా ట్రైన్ లో నా 'ఫస్ట్నైట్' : చిరంజీవి
హైదరాబాద్: నవ్వులకు పెట్టింది పేరు అల్లు రామలింగయ్య. ఇంకా మనతో జీవించేవున్నాడు అనడానికి కారణంగా ఇచ్చే పురస్కారం 'డాక్టర్ అల్లు రామలింగయ్య కళాపీఠం జాతీయ పురస్కారం'. 2015 సంవత్సరంకు గాను దర్శకేంద్రుడు డాక్టర్ కే రాఘవేంద్రరావుకి అవార్డును ప్రదానం చేశారు. ఈ ప్రదానోత్సవం కార్యక్రమం బుధవారం హైదరాబాద్లో ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా అల్లు రామలింగయ్య అల్లుడైన మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. నాకు 'ఫస్ట్నైట్' అరేంజ్ చేసింది మాత్రం రాఘవేంద్రరావు గారని చెప్పారు. రాఘవేంద్రరావు సినిమా అంటేనే ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చేది పూలు, పళ్లు, స్వీట్లే.
'పెళ్లయిన కొత్తలో ఒకసారి సినిమా షూటింగ్ నిమిత్తం నేను, సురేఖ రైలులో మద్రాసుకు వెళ్తున్నాం. మేము రైలులో వెళ్తున్నా సంగతి తెలుసుకున్న డైరక్టర్ గారైన రాఘవేరారావు గారు మాకోసం రైలు బోగీలో పూలు, పళ్లు, స్వీట్లతో అచ్చం ఆయన సినిమాలోని ఫస్ట్నైట్ సీన్ను తలపించేలా డెకరేట్ చేయించారు.
ఇదంతా ఆయన ఒక్క ఫోన్ కాల్తో చేయించారు. ఇలాంటి ఫస్ట్నైట్ నేను నిజంగా ఎప్పుడూ చేసుకోలేదు. ఆ రైలు ప్రయాణాన్ని ఎప్పటికీ మర్చిపోలేను''. అని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.