రాఖీ వేడుక : ఎయిర్ కోస్టా క్యాబిన్ క్రూతో చిరంజీవి (ఫొటోలు)
హైదరాబాద్ : రాఖీ సంబరాలలో చిరంజీవి కూడా పాల్గొన్నారు. అయితే ఆయన ఎయిర్ కోస్టా క్యాబిన్ క్రూతో రక్షా బంధన్ వేడుక జరుపుకున్నారు. 80ల నాటి నటుల రీయూనియన్ పార్టీలో పాల్గొని చెన్నై నుంచి హైదరాబాద్ ఎయిర్ కోస్టా ప్లైయిట్ లో వచ్చారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
ఇది గమనించిన ఎయిర్ కోస్టా క్యాబిన్ సిబ్బంది ఆయనతో కలిసి రక్షాబంధ న్ వేడుక జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. క్రూలోని వారు ఆయన రాఖీలు కట్టారు. మరోప్రక్క చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ కూడా తన చెల్లెళ్లతో కలిసి రక్షాబంధన్ వేడుకలు జరుపుకున్నారు. ఆ ఫొటోలను ఫేస్ బుక్ పేజీలో అప్ డేట్ చేసారు.
విజయవాడ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఎయిర్కోస్టా ప్రస్తుతం చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, జైపూర్, అహ్మదాబాద్, తిరుపతి, కోయంబత్తూర్, విశాఖపట్నం, విజయవాడకు ప్రతి రోజు విమానాలు నడుపుతోంది.
మరో ప్రక్క చిరంజీవి..ఎయిర్ కోస్టా క్యాబిన్ క్రూ తో జరుపుకున్న వేడుకలకు సంభందించిన ఫొటోలు అంతర్జాలంలో చక్కర్లు కొడుతూ మెగా అభిమానులను విశేషంగా అలరిస్తున్నాయి. మీకూ ఆ ఫొటోలు చూడాలని ఉందా. అయితే క్రింద చూడండి.
స్లైడ్ షోలో ఫొటోలు...

క్రూతో కలిసి
చిరంజీవి ..క్యాబిన్ క్రూతో కలిసి ఇలా...

మరోటి
చిరంజీవి క్రూ తో కలిసి దిగిన మరో ఫొటో

రాఖీ కడుతూ
చిరంజీవి రాఖీ కడుతూ స్టాఫ్

స్నాప్
స్టాఫ్ తో కలిసి ఓ సారి ఇలా క్లిక్ మనిపించి


Click it and Unblock the Notifications











