Don't Miss!
- News దేశంలో ఫస్ట్ టైమ్, పోలీసులకు ఏసీ హెల్మెట్లు, ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి, పండగే పండగ !
- Sports LSG vs CSK: రూ. కోట్లు పలికిన ఆ ఇద్దరిని తప్పించాం- రుతురాజ్
- Lifestyle ఇవి తింటే మీ జుట్టు చాలా బలంగా మారుతుంది.. బట్టతల కూడా రాదు..
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
పూరి ప్లాన్ మామూలుగా లేదుగా: దిల్ రాజు చేతికి ‘మెహబూబా’, డేట్ ఫిక్స్
Recommended Video
పూరీ జగన్నాథ్ ప్రస్తుతం తన ఫోకస్ అంతా తన కుమారుడు ఆకాష్ పూరిని ఇండస్ట్రీలో హీరోగా నిలబెట్టడంపైనే పెట్టారు. ఆకాష్ హీరోగా సొంత బేనర్లో 'మెహబూబా' చిత్రాన్ని రూపొందిస్తున్న ఆయన.... విడుదల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు. సినిమా ఎంత బాగా తీసినా దాన్ని గ్రాండ్గా విడుదల చేసినపుడే ఫలితం దక్కుతుంది. అందుకే ఆయన ఈ చిత్రాన్ని దిల్ రాజు చేతిలో పెట్టారు.
దిల్ రాజు పవర్... పైగా లక్కీ హ్యాండ్
తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న పవర్ ఫుల్ డిస్ట్రిబ్యూటర్లలో దిల్ రాజు ఒకరు. ఆయన చేతికి సినిమా వెళ్లిందంటే కావాల్సినన్ని థియేటర్లు దొరుకుతాయి. సినిమాకు కూడా ఊహించిన దానికంటే ఎక్కువ హైప్ వస్తుంది. పైగా ఆయనది లక్కీ హ్యాండ్. అందుకే మెహబూబా చిత్రాన్ని ఆయన చేతిలో పెట్టారు.
నెల జీతం సరిపోవడం లేదు: చిన్నారి కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన
అఫీషియల్గా ప్రకటన
ఈ మేరకు ‘పూరీ కనెక్ట్స్' చిత్ర నిర్మాణ సంస్థ నుండి అఫీషియల్ ప్రకటన వెలువడింది. ఈ సినిమా కోసం దిల్రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్తో చేతులు కలిపినట్లు అందులో పేర్కొన్నారు.
గతంలో పూరి-దిల్ రాజు కాంబినేషన్లో
గతంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇడియట్', ‘పోకిరి' చిత్రాలతో దిల్ రాజు అసోసియేట్ అయ్యారు. చాలా కాలం తర్వాత వీరి అసోసియేషన్లో ‘మెహబూబా' సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
మే 11న గ్రాండ్ రీజ్
‘మెహబూబా' చిత్రంలో ఆకాష్ పూరికి జోడీగా బెంగళూరు భామ నేహాశెట్టి నటిస్తోంది. ఈ చిత్రాన్ని మే 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
అదిరిపోయే మేకింగ్
1971 ఇండో-పాక్ యుద్ధం నేపథ్యంలో జరిగే లవ్ స్టోరీ ఈచిత్రం. తన కుమారుడిని ఇండస్ట్రీలో హీరోగా నిలబెట్టేందుకు ఎపిక్ లవ్ స్టోరీ ఎంచుకున్నారు పూరి. అందుకే తనే స్వయంగా నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. టీజర్ చూసిన తర్వాత నిజంగానే ఈ చిత్రం ‘ఎపిక్' అనే పదానికి న్యాయం చేస్తుందనే నమ్మకం కలిగించింది.