Don't Miss!
- Finance Gold Rate: పిచ్చెక్కిస్తున్న పసిడి ధరలు.. నేడు మళ్లీ పెరుగుదల.. రూ.4,900 అప్..
- News కేసీఆర్ తో టచ్ లో ఉన్న కాంగ్రెస్ ముఖ్యులెవరు..!!
- Lifestyle పుచ్చకాయ జ్యూస్ లో ఈ ఒక్కటి కలిపి తాగితే చాలు వేసవి ఆరోగ్య సమస్యలు బలాదూర్..మీ శరీరానికి శాంతం..ఉపశమనం
- Sports హార్దిక్కు అంబానీ వార్నింగ్.. సంచలన నిర్ణయానికి సిద్ధం!
- Automobiles ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మహానటి: ఎస్వీ రంగారావు పాత్రలో మోహన్ బాబు?
మహానటి మూవీలో మోహన్ బాబు నటించబోతున్నారని సమాచారం. ఈ చిత్రంలో ఆయన ఎస్వీ రంగారావు పాత్రలో నటించబోతున్నారట.
హైదరరాబాద్: ప్రముఖ నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ 'మహానటి'లో సీనియర్ ఎన్టీఆర్ పాత్రలో జూ ఎన్టీఆర్ నటించబోతున్నారంటూ ప్రచారం మొదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం ఇంకా అఫీషియల్గా ఖరారు కాలేదు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాలో ప్రముఖ నటుడు మోహన్ బాబు నటించబోతున్నారని, ఆయన లెజెండరీ తెలుగు యాక్టర్ ఎస్వీ రంగారావు పాత్రలో కనిపించబోతున్నారని టాక్.
మొదట ఈ పాత్రకు ప్రకాష్ రాజ్ ను అనుకున్నారని, అయితే మోహన్ బాబు కంటే ప్రకాష్ రాజ్ బెటరనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎస్వీ రంగారావు పాత్ర చేయడం అంటే ఏ నటుడికైనా గర్వకారణమే.
'మహానటి'లో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. మళయాలం హీరో దుల్కర్ సల్మాన్ ఈ చిత్రంలో జెమినీ గణేశన్ పాత్రకు ఎంపికయ్యాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అశ్వినీదత్ కూతురు నిర్మిస్తోంది. ఈ చిత్రంలో సమంత, విజయ్ దేవరకొండ కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం.