Don't Miss!
- News మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరింత ఉధృతంగా వైఎస్ జగన్ చివరి విడత ప్రచారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఇది మా ఖర్మ అంటూ.... దర్శకుడు హరీష్ శంకర్ ఆవేదన!
Recommended Video
మూవీ ఇండస్ట్రీకి అతిపెద్ద సమస్యగా మారిన అంశం పైరసీ. ప్రపంచ వ్యాప్తంగా దీని వల్ల కోట్లాది రూపాయలు నష్టం ఏర్పడుతోంది. తెలుగు సినిమా పరిశ్రమ కూడా దీని వల్ల చాలా నష్టపోవాల్సి వస్తోంది. 2017 సంవత్సరంలో అత్యధికంగా పైరసీకి గురైన తెలుగు సినిమాల వివరాలు బయటకు వచ్చాయి.
తెలుగు సినిమా పరిశ్రమలో అత్యధిక బడ్జెట్తో తెరకెక్కిన 'బాహుబలి-2' సినిమాతో పాటు, దువ్వాడ జగన్నాధమ్, అర్జున్ రెడ్డి సినిమాలు 2017లో ఎక్కువగా పైరసీకి గురయ్యాయట. ఈ విషయం దర్శకుడు హరీష్ శంకర్ దృష్టికి రావడంతో ట్విట్టర్ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సినిమా వాళ్లు చేసుకున్న ఖర్మ అంటూ ట్వీట్ చేశారు.
కాగా... హరీష్ శంకర్ సినిమాల విషయానికొస్తే, 'దువ్వాడ జగన్నాధం' తర్వాత ఈ దర్శకుడి నుండి సినిమాలేవీ రాలేదు. ఏ ప్రాజెక్టు కూడా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. నితిన్, శర్వానంద్ హీరోలుగా ఈ చిత్రం రూపొందనునట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి దాగుడుమూతలు అనే ఆసక్తికరమైన టైటిల్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
దీంతో పాటు 'సీటిమార్' టైటిల్తో మరో కథను సిద్ధం చేసుకున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రాజెక్టులకు సంబంధించి అఫీషియల్ సమాచారం వెలువడాల్సి ఉంది.